టాలీవుడ్లో ఫలక్ నామా దాస్ సినిమాతో ఒక్కసారిగా యూత్తో పాటు కొన్ని వర్గాల ప్రేక్షకులను తన వైపునకు తిప్పుకున్న క్రేజీ హీరో విశ్వక్సేన్ నటించిన తాజా సినిమా హిట్. ఈ హిట్ సినిమాకు చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా ఉన్నారు. ఇటీవల నాని నిర్మాతగా మారి చిన్న చిన్న సినిమాలు తీస్తున్నారు. నాని నిర్మించిన అ సినిమా సైతం కమర్షియల్గా ఎలా ఉన్నా అవార్డుల పరంగా మంచి మార్కులు కొట్టేసింది. అలాగే విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది.
ఇక ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ డాక్టర్ శైలేష్ దర్శకుడు. ఇక హిట్ ప్రమోషన్లు కూడా చాలా కొత్తగా సాగాయి. విశ్వక్ సేన్ సరసన రుహానీ శర్మ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కథ, కథనాల విషయానికి వస్తే విక్రమ్ రుద్రరాజు(విశ్వక్ సేన్) ఒక సక్సెసఫుల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. అయితే విశ్వక్ సేన్కు గతం ఉంటుంది. ఈ గతం వల్ల అతడు మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ప్రీతి అనే అమ్మాయి మిస్ అయినట్టు అతడి వద్దకు ఓ కేసు వస్తుంది. ఈ కేసును విచారిస్తోన్న క్రమంలోనే మరో షాక్ తగులుతుంది.
తనతోటి ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్ నేహా(రుహాని శర్మ) కూడా మిస్ అవ్వడం వలన అందరికీ విక్రమ్ మీద అనుమానాలు మొదలవుతాయి. దాంతో విక్రమ్ స్వయంగా ప్రీతీ, నేహాల కేస్ ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. ఇక అక్కడి నుంచి ఆ కేసు సాల్వ్ చేయడంలో విక్రమ్ ఎదుర్కున్న సవాళ్లేంటి.? విక్రమ్ ఎలా ఆ కేసుని సాల్వ్ చేసాడు? ప్రీతి – నేహా ల మిస్సింగ్ వెనుక ఉన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏమిటి ? విక్రమ్ గత జీవితం ఏమిటి ? అన్నదే ఈ సినిమా స్టోరీ. ఏదేమైనా ఆసక్తికరమైన కథ, కథనాలతో హిట్ మంచి టాక్ సొంతం చేసుకుంది.