ప్రస్తుత తరం ప్రేక్షకుల అభిరుచి మారిపోవడంతో హీరోతో సమానంగా విలన్ పాత్ర ఉండటమే కాకుండా విలన్ పాత్రధారి కూడ చాల హుందాగా అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ ట్రెండ్ కు అనుగుణంగా ఇప్పుడు క్రిష్ పవన్ తో తీస్తున్న లేటెస్ట్ మూవీలో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రామ్ పాల్ ను ఈ మూవీ విలన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 


ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా మార్చి బాలీవుడ్ లో కూడ విడుదల చేయాలి అన్న ఉద్దేశ్యం క్రిష్ కు ఉండటంతో ఈ మూవీలో నటించేందుకు అర్జున్ రామ్ పాల్ ను ఎంపిక చేయడం ద్వారా ఈ మూవీకి బాలీవుడ్ మార్కెట్ లో కూడ మంచి క్రేజ్ తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు. అర్జున్ రామ్ పాల్ కు బాలీవుడ్ యూత్ లో మంచి క్రేజ్ ఉండటం కూడ క్రిష్ ఎంపికను ప్రభావితం చేసింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. 


‘విరూపాక్ష’ అన్న టైటిల్ ను ఇప్పటికే ఫిక్స్ చేసిన పరిస్థితులలో ఈ మూవీ టైటిల్ చాల సులువుగా అన్ని భాషల ప్రేక్షకుల మధ్యకు వెళ్ళిపోతుందని అంచనాలలో క్రిష్ ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా కథను పూర్తిగా విన్న కీర్తి సురేశ్ ఈ మూవీలో నటించడానికి ఒప్పుకుందని అయితే ఆమె డేట్స్ సద్దుబాటు మాత్రమే సమస్యగా మారింది అని అంటున్నారు. 


ఇది ఇలా ఉండగా ఈ మూవీలో మరో కీలకమైన లేడీ విలన్ నెగిటివ్ రోల్ కు అనసూయ ఖరార్ అయింది అన్న లీకులు కూడ వస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ పరాభవంతో తీవ్ర అవమానానికి గురైన క్రిష్ ఈ సినిమాను ఎదో విధంగా హిట్ చేసి తీరాలి అన్న పట్టుదలతో ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్నీ అన్వేషణ చేస్తూ తన శాయశక్తులా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి రోజున ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియా లెక్క చేయకుండా విడుదల చేసి అందరికీ షాక్ ఇవ్వాలని క్రిష్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: