తమిళ హీరో  కార్తి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలచిన చిత్రంఖైదీ. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం గత ఏడాది దీపావళి సమయం లో విడుదలై 100కోట్ల వసూళ్లను రాబట్టింది. రొటీన్ కు భిన్నంగా పాటలు , హీరోయిన్ లేకుండా యాక్షన్ ఎంటర్ టైనర్ గా  రూపొందిన ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీ లో రీమేక్ చేయనున్నారు. ఒరిజినల్ వెర్షన్ ను నిర్మించిన డ్రీం వారియర్ పిక్చర్స్ సంస్థ,రిలియన్స్ ఎంటర్ టైమెంట్స్ తో కలిసి ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించనుంది. ఈరీమేక్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ హీరోగా నటించనున్నాడు అయితే డైరెక్టర్ విషయం లో మాత్రం క్లారిటీ రావాల్సివుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 న ఈ సినిమా విడుదలకానుంది. త్వరలోనే  ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. 
 
 
ఇక ఇటీవల తానాజీ తో సూపర్ హిట్ కొట్టిన అజయ్ దేవగణ్ ప్రస్తుతం మైదాన్ తోపాటు బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు. ఫుట్ బాల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మైదాన్ ఈఏడాది డిసెంబర్ 11న విడుదలకానుంది. ఇక ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే ఈ సినిమాలో అజయ్ దేవగణ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యాడు. తెలుగులో ఆయనకు ఇదే మొదటి సినిమా. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా తెలుగు తోపాటు మొత్తం 10భాషల్లోఈ చిత్రాన్ని జనవరి 8న  విడుదలచేయనున్నారు. ఇక ఈ సినిమా విడుదలైన  నెలరోజుల తరువాత అజేయ దేవగణ్ ఖైదీ రీమేక్ తో రానున్నాడు. సో  రెండు నెలల గ్యాప్ లో అజయ్ దేవగణ్ మూడు సినిమాలతో రానున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: