అక్కినేని నాగార్జున ఇంట్లో మొదటి నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారం వెళతారు. తండ్రి నాగేశ్వరరావు ఉన్నప్పుడు కూడా ఆయన ఏదైన ఒక మాట చెపితే దానికి కట్టుబడి ఉండేవాళ్ళు. ఆ తర్వాత నాగార్జున మాటకు ఇంట్లో ఎక్కువశాతం విలువుంటది నాగార్జున కూడా ఏదైన ఒక మాట చెపితే దానికి అందరూ కట్టుబడి ఉంటారు. మరి అలాంటిది ఈ మధ్య కాస్త చిన్న చిన్న విషయాల్లో కొన్ని తేడాలు వస్తున్నాయి. అదేమిటి అనుకుంటున్నారా.... నాగచైతన్య కాని, అఖిల్ కాని వాళ్ళ కెరియర్ విషయంలో అలాగే ఏ విషయంలోనైనా సరే నాగార్జున చాలా ఆచి తూచి అడుగులు వేస్తుంటారు. ఎంతో ఓర్పుగా నేర్పరితనంతో ఆలోచిస్తారు. అలాగే ఇద్దరు కొడుకులు కూడా ఆయన మాటకు ఎంతో విలువిస్తారు.
మరి అలాంటిది ఈ మధ్య కొన్ని తేడాలొచ్చాయి. కోడలు వచ్చాక మామ, కోడళ్ళకి మధ్య వాదన బాగానే ఉంటుందట. ఇక ఏ విషయంలోనైనా సమంత సొంత నిర్ణయాలు తీసుకుంటుందట దాంతో అవి నాగార్జునకు పెద్దగా నచ్చడంలేదట. అలాగని ఏమీ అనలేక చైతుని అంటూ ఉంటారు. కానీ చైతూ ఇటు సమంతకి, అటు నాగార్జునకి మధ్యలో నలిగిపోతుంటారు. ఉదాహరణకి ఇటీవలె చైతూ,శ్యామ్ కలిపి ఓ కొత్త ప్రొడక్షన్ హౌస్ని పెట్టారు. అన్నపూర్ణపేరుతో ఆల్రెడీ ఇంత పెద్ద బ్యానర్ ఉండగా మళ్ళీ ఇదెందుకు అన్న వాదనలు కూడా వచ్చాయి. అయితే ఇది కేవలం బయటవారి వాదనలు మాత్రమే కాదట. ఇంట్లో వారి నుంచి కూడా వచ్చాయట. ఆల్రెడీ ఇంత పెద్ద బ్యానర్ ఉండగా మళ్ళీ మీరిద్దరు సొంత బ్యానర్ ఎందుకని నాగార్జున చైతూతో అన్నగా సమంత మాత్రం మనకంటూ ఓ సొంత బ్యానర్ ఉండాలంటూ చాలా గట్టి మంకు పట్టు పట్టిందట. ఇక కొడుకు అటు భర్యాకు, ఇటు తండ్రికి చెప్పలేక సతమతమవుతున్నాడట.
ఇక సమంత వేసే ఒక్కో స్కెచ్తో అక్కినేని ఫ్యామిలీ అంతా గగ్గోలు పెట్టేస్తుందట. సాధారణంగా హీరోయిన్లంతే వాళ్ళకంటూ ఓ ప్రత్యేక ప్రైవసీ ఉంటుంది. ఈ రోజుల్లో ఎక్కువ శాతం అలానే కోరుకుంటున్నారు. గతంలో ఇలాంటి విషయాల్లోనే తేడా వచ్చి సుమంత్కి కీర్తిరెడ్డి దూరమయిందని అంటున్నారు. అయితే దానికి కారణం కూడా అప్పట్లో వాళ్ళ అక్క సుప్రియ అని చెబుతుంటారు. మరి ఏది ఏమైన్పపటికీ ఈ రోజుల్లో కొన్ని చూసి చూడనట్లు వదిలేయాలి. ప్రతిది మన కంట్రోల్లో ఉండాలి అనుకోవడం ప్రస్తుత యువతని బట్టి కరెక్ట్ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.