టెంపర్ తరువాత ఎన్టీఆర్ వరసగా హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నారు. డబుల్ హ్యాట్రిక్ నమోదు చేసుకున్న ఈ స్టార్ హీరో ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా 70శాతం వరకు షూట్ పూర్తి చేసుకుంది. మిగతా 30శాతం షూటింగ్ త్వరలోనే పూర్తి చేసుకోబోతున్నది. ఈ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ప్రారంభం అవుతుంది.
మే నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుందని అంటున్నారు. ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ రాజకీయాలకు సంబంధించిన కథను సిద్ధం చేసుకున్నారు. ఇప్పటి వరకు త్రివిక్రమ్ ఇలాంటి కథతో సినిమా చేయలేదు. ఇది పూర్తిగా రాజకీయాలకు సంబంధించిన సినిమా అని తెలుస్తోంది. సినిమా కథనం కూడా కొత్తగా ఉండబోతుందట. అందుకే ఈ సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు అని టైటిల్ అనుకున్నారని అంటున్నారు.
సినిమాను పక్కా జంధ్యాల మార్క్ కామెడీతో తెరకెక్కిస్తారని సమాచారం. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. వర్ధమాన రాజకీయాలకు సంబంధించిన సినిమా కావడంతో ఆసక్తి నెలకొన్నది. రాజకీయాలకు సంబంధించిన కథతో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఆసక్తికరంగా మారింది. ఇక ఇదిలా ఉంటె ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని కూడా ప్రచారం జరుగుతున్నది. ఒకరు సమంత కాగా, మరొకరు బాలీవుడ్ హీరోయిన్ అని అంటున్నారు.
త్రివిక్రమ్ కూడా చాలా కాలంగా పాన్ ఇండియా మూవీ తీయాలని అనుకుంటున్నారు. ఎలాగో ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా సినిమా కాబట్టి, ఎన్టీఆర్ కు బాలీవుడ్ లో క్రేజ్ పెరుగుతుంది. ఈ సినిమా రిలీజ్ తరువాత ఎన్టీఆర్ కు బాలీవుడ్ మార్కెట్ పేరుంటుంది. సో, ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చే సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగా తీస్తే మంచిగా క్యాష్ చేసుకోవచ్చు అన్నది త్రివిక్రమ్ ఆలోచన. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.