టాలీవుడ్ లో ఎన్నో కామెడీ సినిమాల్లో తనదైన మార్క్ చాటుకున్నారు కమెడియన్ సునీల్.  అప్పట్లో సునీల్ పర్సనాలిటీకి తగ్గట్టు ఎన్నో కామెడీ పాత్రలు వచ్చాయి.  హీరోల స్నేహితుడిగా నటిస్తూ తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవారు సునీల్.  ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ ఈయన రూమెట్స్.. మంచి మిత్రులు.  ఒకదశలో సినీ పరిశ్రమకు ఇద్దరు ఒకే సమయంలో వచ్చి త్రివిక్రమ్ దర్శకుడిగా.. సునీల్ నటుడిగా మారారు.  తన కెరీర్ సాగడానికి త్రివిక్రమ్ ఎంతో సహాయపడ్డారని పలు సందర్భాల్లో సునీల్ చెప్పిన విషయం తెలిసిందే.  కమెడీయన్ గా నటిస్తున్న సునీల్ ‘అందాలరాముడు’ సినిమాతో హీరోగా మారారు.

 

ఆ తర్వాత సిక్స్ ప్యాక్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు సునీల్.  కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన పెద్దా కలిసి రాలేదు.  రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాదరామన్న’ ఒక్కటే కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. దాంతో హీరోగా తనకు అచ్చిన రావడం లేదని తిరిగి కమెడియన్ గా స్థిరపడ్డారు.  ఇప్పుడు సునీల్ ట్రెండ్ మార్చారు.. కమెడియన్ గానే కాదు విలన్ గా తన సత్తా ఏంటో చూపించాలని చూస్తున్నారు.  ఇప్పటికే రవితేజ నటించిన ‘డిస్కోరాజా’ మూవీలో విలన్ షేడ్ లో నటించినా.. పెద్దగా వర్క్ఔట్ కాలేదు.  ఎందుకంటే ఇందులో సునీల్ ని చూస్తుంటే విలన్ కన్నా కమెడియన్ గానే ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నట్లు తెలుస్తంది.

 

తాజాగా సందీప్ రాజ్ డైరెక్షన్ లో సుహాస్ హీరోగా వస్తున్న 'కలర్ ఫొటో' మూవీలో కూడా సునీల్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో తన పాత్ర పేరు రామరాజు అని, తన కెరీర్ మొత్తం గుర్తుండిపోయేలా ఈ క్యారెక్టర్ ఉంటుందని సునీల్ సంతోషం వ్యక్తం చేశారు.  'కలర్ ఫొటో' యూనిట్ కు థ్యాంక్స్ చెప్పారు. ఈ మూవీలో నేను సరికొత్తగా కనిపించబోతున్నానని.. ఇది నాకో ఛాలెంజింగ్ పాత్ర ఇందుకోసం చాలా కష్టపడ్డానని సునీల్ అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: