ఈ మద్య టాలీవుడ్ లో వరుస విజయాలతో దున్నేస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే.. కన్నడ బ్యూటీ రష్మిక మందన.  ఈ ముద్దుగుమ్మలు నటించిన ప్రతి సినిమా హిట్ అవుతున్నాయి.  ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు లో రష్మిక మందన మంచి విజయం అందుకుంది. ఇక ‘అల వైకుంఠపురములో’ మూవీతో పూజా హెగ్డే సూపర్ హిట్ అందుకుంది.  అందుకు ముందు ఈ ఇద్దరు హీరోయిన్లు వరుస విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. గతంలో ఒక లైలా కోసం, ముకుంద సినిమాల్లో నటించిన పూజా హెగ్డేకి పెద్దగా కలిసి రాకపోయినా.. అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం తర్వాత వరుస విజయాలు అందుకుంటుంది. 

 

 నాగ శౌర్య నటించిన ‘ఛలో’ మూవీతో విజయం అందుకున్న రష్మిక మందన తర్వాత గీతాగోవిందం తో బ్లాక్ బస్టర్ అందుకుంది.  ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోయిన్ల కాల్షీట్స్ గురించి దర్శక, నిర్మాతలు ఎదరు చూస్తున్నారు.  ఈ నేపథ్యంలో పరశురామ్-చైతు సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్తోందని సమాచారం. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీ నిర్మాత అనిల్ సుంకర మాత్రం ఈ సినిమాకు పూజా హెగ్డే హీరోయిన్ గా తీసుకుందామని అంటున్నారట.

 

 ప్రస్తుతం టాలీవుడ్ లో పూజా ఒక క్రేజీ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే.  పరశురామ్ 'గీత గోవిందం' లో హీరోయిన్ రష్మిక నటించింది.  చైతు గతంలో పూజా హెగ్డే తో 'ఓ లైలా కోసం' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.   మరి డైరెక్టర్ రష్మిక అంటుంటే.. నిర్మాత మాత్రం పూజా అంటున్నారట.  అయితే ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు ఉన్న డిమాండ్ ప్రకారం నాగ చైతన్య పక్కన ఎవరు సెట్ అవుతారో చూడాలి. ఏది ఏమైనా మొన్నటి వరకు సమంత, కాజల్, రకూల్ ప్రీత్ అంటూ వెంట పడేవారు ఇప్పుడు పూజ, రష్మిక అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: