బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియచేసింది. బాహుబలి మొదటి రెండు పార్టుల కోసం ప్రభాస్ దాదాపు ఐదేళ్లు కష్టపడ్డాడు. కెరియర్ పీక్స్ లో ఉన్న టైంలో 5 ఏళ్లు ఒక సినిమా కోసం ప్రయత్నించడం గొప్ప విషయమే. అందుకే బాహుబలి తర్వాత ప్రభాస్ ఇండియన్ హీరో అయ్యాడు. బాహుబలితో ఏర్పడ్డిన క్రేజ్ తో ఆ తర్వాత వచ్చిన సాహో హిందిలో వర్క్ అవుట్ అయ్యింది కాని తెలుగు రెండు రాష్ట్రాల్లో పెద్దగా ఆడలేదు.

   

సాహో తర్వాత జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాకు రాధే శ్యాం, ఓ డియర్ టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఈ మూవీలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మహానటి ఫేం నాగ్ అశ్విన్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. వైజయంతి మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభాస్ తో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా రేంజ్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా ప్రభాస్ బాలీవుడ్ క్రేజీ డైరక్టర్స్ సంజయ్ లీలా భన్సాలి, రాజు హిరాని వీళ్లిద్దరిలో ఒకరితో సినిమా చేయాలని చూస్తున్నాడట.

 

తనకు బాలీవుడ్ లో వచ్చిన ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ఇక మీదట డైరెక్ట్ బాలీవుడ్ సినిమా చేసేలా రంగం సిద్ధం చేసుకుంటున్నాడట. అయితే చేసేది బాలీవుడ్ డైరక్టర్ తో అయినా సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారట. మొత్తానికి ప్రభాస్ మంచి ప్లానింగ్ తోనే ఉన్నాడని చెప్పొచ్చు.  '

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: