టాలీవుడ్ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలసిందే. మూడేళ్ళ క్రితం వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో టాలీవుడ్ కి నటుడిగా కొంత గ్యాప్ తరువాత రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్, ఆ సినిమాతో మంచి హిట్ కొట్టి తన సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. ఇక ఆ తరువాత తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డితో ప్రేక్షకుల ముందుకు వచ్చి మనల్ని అలరించిన మెగాస్టార్, ఎప్పటికప్పుడు వీలైనప్పుడల్లా పలువురు ఇతర నటీనటుల సినిమాల ఫంక్షన్ కు విచ్చేసి తన వంతుగా వారికి సాయం అందించడంలో ఎప్పుడూ ముందు ఉంటుంటారు. 

 

ఇక ఇటీవల నిఖిల్ సిద్దార్థ నటించిన అర్జున్ సురవరం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మెగాస్టార్, అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిన్న సినిమా ఓ పిట్ట కథ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రత్యేక అతిథిగా హాజరై, సినిమా యూనిట్ ని ఆశీర్వదించనున్నారు. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. 

 

ఒక విభిన్నమైన కథతో ఇట్స్ ఏ లాంగ్ స్టోరీ అనే క్యాప్షన్ తో నిర్మితం అవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని ఇటీవల సూపర్ స్టార్ మహేష్ తన చేతులమీదుగా రిలీజ్ చేసి, సినిమా యూనిట్ కి అభినందనలు తెల్పడం జరిగింది. ఇక మార్చి 1వ తేదీన హైదరాబాద్, మాదాపూర్ లోని ఐటిసి కోహెన్పూర్లో గ్రాండ్ గా జరుగనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా రావడం ఎంతో ఆనందంగా ఉందని, మార్చి 6న రిలీజ్ కాబోతున్న మా సినిమాని మంచి సక్సెస్ చేయాలని కోరుతూ నటుడు బ్రహ్మాజీ కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక పోస్ట్ చేసారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: