టాలీవుడ్ లో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ మేనియా నడుస్తుంది అనేది వాస్తవం. ఆ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఏ చిన్న వార్త వచ్చినా సరే మీడియా కూడా ఆ సినిమా మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ వార్తలు ప్రసారం చేస్తుంది. ఎన్ని సినిమాలు ఇప్పుడు విడుదల అవుతున్నా సరే ఆ సినిమా గురించి ప్రతీ చర్చా ఆసక్తికరంగానే ఉంటుంది. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో రావడం ఒకటి అయితే మెగా నందమూరి హీరోలు ఇద్దరూ ఒకే ఫ్రేం లో కనపడటం మరొకటి. 

 

టాలీవుడ్ లో గత రెండు దశాబ్దాలలో ఇంత పెద్ద సినిమా ఎప్పుడు ప్రేక్షకులు చూడలేదు. ఈ తరానికి ఇలాంటి సినిమా అసలు పరిచయం లేదు కూడా. గతంలో మెగా నందమూరి కలిసి చేసినా సరే ఇంత క్రేజ్ ఉండేది కాదు. ఇప్పుడు మీడియా పెరగడం ప్రేక్షకులు కూడా పెరగడం మీడియాతో ఎక్కువగా హడావుడి చేస్తూ వస్తుంది. అందుకే ఇప్పుడు ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చినా సరే ప్రేక్షకులు ఆశగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది జూన్ లేదా జూలై లో విడుదల చేస్తారని భావించారు అందరూ. 

 

కాని ఆ సినిమా మళ్ళీ దసరా కు అన్నారు. అక్కడి నుంచి సంక్రాంతికి మారిపోయింది. దీనితో ఇప్పుడు ప్రేక్షకుల్లో ఒకరకమైన అసహనం ఉంటుంది. ముఖ్యంగా ఫాన్స్ రాజమౌళి పేరు వింటేనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది. తాజాగా ఓ నెటిజన్ `ఆర్ఆర్ఆర్` పేజీని ట్యాగ్ చేస్తూ `అప్‌డేట్స్ ఇంకెప్పుడు ఇస్తావు` అంటూ కోపంగా ఉన్న ఎమోజీలను పోస్ట్ చేశాడు. దీనికి స్పందించిన చిత్రబృందం `మార్చి నుంచి` అని సమాధానం ఇచ్చింది. దీనితో మార్చ్ లో రామ్ చరణ్ పుట్టిన రోజు ఉంది కాబట్టి లుక్ విడుదల అవ్వడం ఖాయమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: