సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేసే సినిమా మీద అందరికి ఎంతో ఆసక్తి ఉంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మహేష్ బాబు తన తర్వాతి సినిమాను ఏ దర్శకుడి తో చేస్తాడు అంటూ సోషల్ మీడియా తో పాటుగా ప్రధాన మీడియా కూడా చర్చలు పెడుతుంది. వాస్తవానికి అనీల్ రావిపూడి తో పూర్తి అయిన తర్వాత మహేష్ బాబు వంశీ పైడపల్లి తో సినిమా చెయ్యాల్సి ఉంది. దీనికి సంబంధించి అంతా సిద్దమైన తరుణంలో అనూహ్యంగా ఆ సినిమా ఆగిపోయింది అంటూ వార్తలు వచ్చాయి. 

 

మహేష్ బాబుకి కథ నచ్చలేదని, కాబట్టి ఆ సినిమా ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని, మహేష్ బాబు గీత గోవిందం ఫేం పరుశురాం కి ఫోన్ చేసారని ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు అని ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబు ఆయనతో సినిమా చేయడానికి అంతా సిద్దం చేసుకున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అలాగే మరో దర్శకుడి పేరు కూడా ప్రధానంగా వినపడింది. అయితే ఇది నిజం కాదని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. మహేష్ బాబు వంశీ తో సినిమా వద్దని అనుకోలేదని కేవలం టైం మాత్రమే ఇచ్చాడని అంటున్నారు. 

 

ఆ సినిమాకు సంబంధించి ఇంకా కథ సిద్దం కాలేదని మహేష్ బాబుకి నచ్చిన విధంగా కథ రాలేదని అందుకే ఆ సినిమా వాయిదా పడిందని అంటున్నారు. మహేష్ బాబు వంశీ పైడపల్లికి గడువు ఇచ్చారని ఆ గడువు లోగా కథ సిద్దం అయితే ఓకే లేకపోతే మాత్రం ఆ సినిమాను వాయిదా వేసుకుని మరో దర్శకుడి తో చేస్తాడని గాని పరుశురాం మాత్రం ఫైనల్ అవ్వలేదని అంటున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మహేష్ బాబు ప్రస్తుతం విదేశీ పర్యటన తర్వాత ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: