తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు వరుస విజయాలు అందుకుంటుంది కన్నడ బ్యూటీ రష్మిక.  ఈ అమ్మడు ఛలో చిత్రం  తో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి చిత్రం తో సక్సస్ సాధించి లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. ఆ తర్వాత సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో గీత గోవిందం చిత్రం చేసి బ్లాక్‌బస్టర్ సొంతం చేసుకుంది. ఇక ఇండస్ట్రీ అన్న తర్వాత కొంత మంది లక్కీ హీరోయిన్లు ఉంటారు.. బ్యాడ్ లక్ హీరోయిన్లు ఉంటారు. తాజాగా రష్మిక ను మాత్రం మంచి గోల్డెన్ లెగ్ అని అంటున్నారు. గీతాగోవిందం  నాగ్ - నాని కాంబినేషన్లో రూపొందిన దేవదాస్ చిత్రం లో నటించి మరో విజయం సాధించింది. తన అందం, అభినయంతో ఆకట్టుకోవడంతో అనతి కాలంలోనే ప్రేక్షక హృదయాలను దోచుకుంది ఈ అమ్మడు.  మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మరో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 

 

అయితే ఈ అమ్మడిని ప్రతి ఒక్కరూ లక్కీ హీరోయిన్ అని అంటున్నారు. ఇదే ఏడాది నెల కూడా దాటలేదు.. నితిన్ హీరోగా నటించిన ‘భీష్మ’తో మరో విజయం అందుకుంది.  ఇలా వరుసగా సక్సస్ సాధించడంతో రష్మికకు డిమాండ్ బాగా పెరిగింది. ప్రస్తుతం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటిస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం  మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. అయితే రష్మిక గురించి ముగ్గురు సినీ పెద్దలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరూ అంటారా.. మెగాస్టార్ చిరంజీవి, త్రివిక్రమ్, దిల్ రాజు. 

 

ఆ మద్య మహేష్ బాబు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రష్మికను చూసి ఈ అమ్మాయి ఫంక్షన్ కి నేను ఏదో ఒకరకంగా వస్తున్నాను.. పాత్రకు తగ్గట్టుగా చాలా చక్కగా నటిస్తుంది అంటూ రష్మికను అభినందించారు మెగాస్టార్. ఇక భీష్మ ఫంక్షన్ లో సరిలేరు నీకెవ్వరు తర్వాత భీష్మతో కూడా సక్సస్ సాధిస్తుంది. ఈ సక్సస్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ రష్మికను అభినందించారు. ఇక భీష్మ సక్సస్ మీట్లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. రష్మికది నింజంగా గోల్డెన్ లెగ్ అని చెప్పొచ్చు.  ఒక హీరోయిన్ ఇలా వరుస విజయాలు అందుకోవడం నిజంగా అదృష్టమే అన్నారు. ఆమెలో ఎక్స్‌ట్రార్డినరీ ఎనర్జీ ఉందీ అంటూ తెగ మెచ్చుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: