మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది. గోవింద ఆచార్య అనే టైటిల్ తో ఈ సినిమా వస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోదావరి నది పరివాహక ప్రాంతంలో జరుగుతుందని టాక్. ఇటీవల చిరంజీవి లుక్ కూడా బయటకు వచ్చింది. అక్కడ ఉన్న ఎవరో లీక్ చేయడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ లుక్ లో చిరంజీవి మావోయిస్ట్ గా కనపడుతున్నారని అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ సినిమాలో కీలక సన్నివేశాలను చిత్ర యూనిట్ షూట్ చేస్తుంది. 

 

ఇక ఈ సినిమాలో చిరంజీవి పక్కన త్రిషా నటిస్తుంది. వీరిద్దరూ గతంలో స్టాలిన్ అనే సినిమా చేయగా అది ఫ్లాప్ అయింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు కూడా నటిస్తున్నట్టు సమాచారం. దీనితో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు సైరా నరసింహారెడ్డి తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇక దర్శకుడు కూడా కాస్త జాగ్రత్తగానే ఈ సినిమా విషయంలో వ్యవహరిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా తర్వాత చిరంజీవి చేయబోయే సినిమా గురించి ఒక వార్త బయటకు వచ్చింది. 

 

ప్రస్తుతం చిరంజీవి, కొరటాల కాంబినేషన్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్.. చిరంజీవి తర్వాత చేయబోయే లూసిఫర్ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు ఆ సినిమాకు దర్శకుడ్ని వెతికే పనిలో ఉన్న రామ్ చరణ్... వీవీ వినాయక్ ని ఖరారు చేసినట్టు సమాచారం. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ `ఖైదీ నంబ‌ర్ 150`ను వినాయక్ డైరెక్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.  ఆ సినిమా మంచి విజయం సాధించింది. దీనితో ఈ సినిమాను కూడా వీవి వినాయక్ కే ఇవ్వాలని భావిస్తున్నాడని టాక్. ఆ సినిమాకు కూడా రామ్ చరణ్ నిర్మాత.

మరింత సమాచారం తెలుసుకోండి: