ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గాని టాలీవుడ్ లో రష్మిక మంధన పట్టింది అల్లా బంగారమే అవుతుంది. ఆమె ఏ సినిమా చేసినా హిట్ అవుతుంది. ఈ ఏడాది రెండు సినిమాలు చేసింది. ఆ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. మహేష్ బాబు సరసన నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా మంచి హిట్ కాగా తాజాగా వచ్చిన భీష్మ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ రెండు సినిమాలతో మంచి ఫాలోయింగ్ కూడా తెచ్చుకుంది. నటన పరంగా కూడా పాప మంచి మార్కులే కొట్టేసింది. 

 

మహేష్ లాంటి హీరో పక్కన ఏ మాత్రం ఇబ్బంది పడకుండా నటించింది ఈ అమ్మడు. ఇక సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోయే సినిమాలో ఈ భామ నటిస్తుంది అని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఇది ఫైనల్ కూడా అయిపోయినట్టు సమాచారం. ఇక పారితోషికం కూడా ఈ మధ్య భారీగానే పెంచేసింది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మాయి గురించి ఒక వార్త వచ్చింది. కిర్రాక్ పార్టీ తో హీరోయిన్ గా వచ్చిన ఈ అమ్మాయిని ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ లో మళ్ళీ తీసుకోవాలని భావిస్తున్నాడు దర్శకుడు. 

 

సినిమా షూటింగ్ సమయంలోనే హీరో రక్షిత్‌ తో రష్మిక ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఏమైందో ఏమో తెలియదు గాని వాళ్ళు విడిపోయారు. ఇరు కుటుంబాల పెద్దలనూ ఒప్పించి గ్రాండ్‌గా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. `కిరాక్‌పార్టీ` సినిమాకు సీక్వెల్ చేయాలని రక్షిత్ ప్లాన్ చేస్తున్నాడట. నిర్మాణంతోపాటు దర్శకత్వం కూడా చేపడుతున్నాడట. `కిరాక్‌పార్టీ`లో నటించిన నటులు అందరిని ఈ సీక్వెల్‌ లోనూ తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడని టాక్. ఇందుకోసం రష్మిక మందన్నా ని మళ్ళీ కలవాలని భావిస్తున్నాడు. మరి ఆమె ఏమంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: