మన దర్శక నిర్మాతల కన్ను బాలీవుడ్ మీద పడితే బాలీవుడ్ హీరోయిన్స్ కన్ను మన టాలీవుడ్ మీద పడింది. ఎలాగైనా ఛాన్స్ దక్కించుకొని టాలీవుడ్ లో జండా పాతేయాలని చూస్తున్నారు. ఇక్కడ స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్స్ గా వెలగాలని కొందరు బాలీవుడ్ హీరోయిన్స్ ప్లాన్స్ వేసుకుంటున్నారు. ముఖ్యంగా నట వారసులు ఈ విషయంలో ఒకడుగు ముందున్నారు.

 

వాస్తవంగా వంశపారంపర్యంగా ఇండస్ట్రీలో నటీ నటులు కొనసాగడం కొత్తకాదు. ఇటు టాలీవుడ్ నుంచి అటు బాలీవుడ్ వరకు ఈ కల్చర్ బాగా పాకుతోంది. ఈ విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా అందులో తప్పులేదంటునారు. అయితే ఈసారి టాలీవుడ్ లో ఓ కొత్త ఆకర్షణ ఏంటంటే.. బాలీవుడ్ కు చెందిన ఇద్దరు ప్రముఖుల కూతుళ్లు ఇప్పుడు ఒకేసారి టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. మరి వీళ్ళలో ఏ బ్యూటి మన తెలుగు మేకర్స్ ని అలాగే ప్రేక్షకులని ఆకట్టుకొని ఇక్కడ సెటిల్ అవుతారో చూడాలి. 

 

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమాలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండేను సెలెక్ట్ చేసుకున్నారు పూరీ టీం. ఇప్పటికే హిందీలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, పతి పత్నీ ఔర్ వో లాంటి సినిమాలు చేసిన ఈ బ్యూటీ హీరోయిన్ గా సూపర్ అనిపించుకుంది. దాంతో పూరి ఈ బ్యూటీని ఎంచుకున్నారు. ఈ బ్యూటి దేవరకొండ సినిమాతో తెలుగులో డెబ్యూ హీరోయిన్ గా మరిచయమవుతోంది.

 

అలాగే అనన్యకు పోటీగా మరో బాలీవుడ్ సెలబ్రిటీ కూతురు కూడా టాలీవుడ్ లో ఎంటరవుతోంది. తనే సయీ మంజ్రేకర్. బాలీవుడ్ నటుడు, దర్శకుడు సక్సస్ ఫుల్ తెలుగు సినిమాల్లో విలన్ గా కూడా నటించిన మహేష్ మంజ్రేకర్ కూతురు ఈ బ్యూటీ. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాతో ఈ అమ్మడు టాలీవుడ్ కు పరిచయం అవుతోంది.

 

ఇటు సయీ మంజ్రేకర్ కైనా, అటు అనన్య పాండేకైనా యాక్టింగ్ లో అనుభవం తక్కువే. అయితే గ్లామర్ విషయంలో మాత్రం సూపర్ అన్న టాక్ ఉమంది. ఫొటోషూట్లతో ఆ విషయాన్ని ఇద్దరూ ప్రూవ్ చేసుకున్నారు. బాలీవుడ్ లో అవకాశాలు పెద్దగా రాక ఇటువైపు మళ్లిన ఈ ఇద్దరిలో ఎవరు తెలుగులో సక్సస్ అవుతారో చూడాలి. లేదంటే పెట్టే బెడా సర్ధుకొని ముంబై ఫ్లైటెక్కేయాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: