టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, రెండు రోజుల క్రితం ఒక శీతల పానీయం యాడ్ కోసం ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. అయితే గత కొద్దిరోజులుగా మీడియా వారందరి కళ్ళు మహేష్ మీదనే ఉన్నాయి. దానికి ప్రధాన కారణం, ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు తరువాత ఇప్పటివరకు తన తదుపరి సినిమాని మొదలెట్టని సూపర్ స్టార్, నెక్స్ట్ సినిమాకు దర్శకుడిగా ఎవరికి అవకాశం ఇస్తారో అని అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే కొద్దిరోజలుగా ప్రచారం అవుతున్న వార్తలను బట్టి చూస్తుంటే, ఇటీవల మహేష్ చెప్పిన విధంగా తన తదుపరి సినిమాని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయడం లేదని వినికిడి. 

 

ఇక నేడు అందుతున్న సమాచారాన్ని బట్టి, ఫైనల్ గా పరశురామ్ కథకు పచ్చ జెండా ఊపిన సూపర్ స్టార్, ఈలోపు కొరటాల, మెగాస్టార్ మూవీలో ఒక కీలక పాత్రలో నటించడానికి కూడా ఒప్పుకున్నట్లు చెప్తున్నారు. ఇకపోతే పరశురామ్ సినిమాని మే నెలాఖరులో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని, అలానే ఈలోపు కొరటాల, మెగాస్టార్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొని దానిని పూర్తి చేయనున్నట్లు చెప్తున్నారు. అలానే పరశురామ్ సినిమాకు సంబంధించి అన్ని ఏర్పాట్లు మొదలయ్యాయని, దానితో పాటు సినిమా ప్రారంభించే డేట్ కూడా నిర్ణయం అయినట్లు చెప్తున్నారు. 

 

మరికొద్దిరోజుల్లోనే దానిపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు టాక్. ఇక పరశురామ్ సినిమా తరువాత వంశీ పైడిపల్లి తో సినిమా చేయనున్నారట మహేష్. నిజానికి వంశీ సినిమా స్క్రిప్ట్ పూర్తి కాకపోవడం వల్లనే అతడి సినిమా వాయిదా పడిందని, ఈలోపు పూర్తి స్క్రిప్ట్ తో మంచి స్టోరీ లైన్ తో వచ్చిన పరశురామ్, దానిని మహేష్ కి వినిపించి ఒప్పించినట్లు చెప్తున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది మంచి ఖుషి చేసే వార్తే అని చెప్పాలి....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: