టాలీవుడ్ లో ఇప్పుడు ఎటు చూసినా సరే ఇద్దరు హీరోయిన్లు మాత్రమే కనపడుతున్నారు. రష్మిక మంధనా, పూజా హెగ్డే. అభిమానులు అన్నట్టు దిక్కులేక వీళ్ళను దర్శకులు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఏమో అని టాలీవుడ్ జనాలు కూడా అంటున్నారు. ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. టాలీవుడ్ లో ప్రస్తుతం వీళ్ళ ఇద్దరికీ అవకాశాలు వరిస్తున్నాయి. అగ్ర హీరోల సరసన వరుసగా సినిమాలు చేస్తున్నారు ఇద్దరు. ఒకరు రెండు సినిమాలు హిట్ అవ్వడంతో ఫుల్ జోష్ లో ఉంటే మరొకరు ఒక సినిమా హిట్ తో పాటుగా వరుసగా ఆఫర్లు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

వీళ్ళకు మంచి డిమాండ్ ఉండటంతో అగ్ర దర్శకులు కూడా ఆఫర్లు ఇస్తున్నారు. ఇక ఇప్పుడు పూజ హెగ్డే బాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకునే ప్రయత్నంలో ఉంది. వరుసగా ఆఫర్లు అక్కడ కూడా వస్తున్నాయి. ఇక ఇప్పుడు తమిళంలో కూడా పూజ కు అవకాశాలు వస్తున్నట్టు సమాచారం. ఆమెను అక్కడి అగ్ర దర్శకులు సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ‘మాస్టర్‌’ తరువాత ఇలయ దళపతి విజయ్‌ నటించబోయే కొత్త చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

ప్రస్తుతం సూర్యతో ‘సూరరైపోట్రు’ సినిమా రూపకల్పలో బిజీగా ఉన్న మహిళా దర్శకురాలు సుధ కొంగర చెప్పిన కథకు విజయ్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. విజయ్‌కి జోడీగా పూజా హెగ్డేని తీసుకోవాలని సుధా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమెను సంప్రదించే పనిలో ఉన్నారట. అయితే రేటు ఆమె ఎంత చెప్తుంది అనేది మాత్రం ఇంకా స్పష్టత రావడం లేదట. ఒకవేళ రెండు మూడు కోట్లు అంటే మాత్రం అక్కడి హీరోయిన్ల తోనే సరిపెట్టే అవకాశాలు ఉన్నాయని కోలివుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ వార్తలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అఖిల్ తో ప్రభాస్ తో సినిమాలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: