సూపర్ స్టార్ మహేష్ బాబు టైం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో నడుస్తుంది. వరుస పెట్టి హిట్టు  మీద హిట్టు కొడుతున్నాడు. భరత్ అనే నేను, మహర్షి తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమా విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు ఇండస్ట్రీ నుండి వార్తలు వచ్చాయి. అయితే వంశీ పైడిపల్లి చెప్పిన స్టోరీ సెకండాఫ్ సరిగ్గా లేకపోవడంతో ఆ ప్రాజెక్టును మహేష్ బాబు పక్కన పెట్టడం జరిగింది. దీంతో మహేష్ బాబు నెక్ట్స్ సినిమా పై అభిమానులలో తీవ్ర టెన్షన్ నెలకొంది. కాగా ఈ క్రమంలో చాలా మంది డైరెక్టర్ ల పేర్లు మహేష్ బాబు తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు బయటకు వచ్చాయి.

 

ఇటువంటి సమయంలో 'గీత గోవిందం' లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తీసిన పరుశురాం మహేష్ కి స్టోరీ చెప్పినట్లు సినిమా అంతా ఓకే అయ్యింది అన్నట్టు ఇండస్ట్రీలో వార్తలు వచ్చాయి. అయితే ఇదే సమయంలో నాగచైతన్యతో పరశురాం సినిమా ఓకే కావడంతో మహేష్ బాబు ప్రాజెక్టును పక్కన పెట్టడం జరిగింది. అయితే ఇటువంటి తరుణంలో నాచురల్ స్టార్ నాని హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన ‘అష్టాచమ్మా’ సినిమా డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి కూడా మహేష్ బాబు కి ఇటీవల ఓ స్టోరీ వినిపించినట్లు సమాచారం అందుతోంది. తాజాగా మహేష్‌ను కలిసిన ఆయన కథ వినిపించాడని ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.

 

మహేష్‌బాబు కథకు ఓకే చెప్పాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ‘వి’ సినిమాను తెరకెక్కిస్తున్న ఇంద్రగంటి మోహనకృష్ణ తన హీరో సుధీర్‌ బాబు ద్వారా మహేష్‌బాబును కలిసి కథ వినిపించినట్లుగా సమాచారం అందుతోంది. సుధీర్‌బాబు విన్న కథను మహేష్‌బాబు విన్నాడు. సుధీర్‌బాబుకు కథ నచ్చి మహేష్‌ బాబు వద్దకు పంపించాడట. దీంతో ఇంద్రగంటి స్టోరీ విన్న మహేష్ బాబు కొన్ని మార్పులు సూచించినట్లు సమాచారం. అయితే అంతా ఓకే అయితే ఈ సినిమాని నాచురల్ స్టార్ నాని నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు ఫిలిం నగర్ టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: