ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ ఎవరూ అంటే టక్కున గుర్తొచ్చే పేరు పూజా హెగ్డే రష్మిక మందన్న. ప్రస్తుతం ఏ స్టార్ హీరో సినిమాలో చూసిన ఇద్దరే కనిపిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది పూజ. ఇక తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు సరసన చాన్స్ కొట్టేసి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని దర్శకనిర్మాతలను ఆకర్షిస్తోంది రష్మిక మందన. ప్రస్తుతం దర్శక నిర్మాతలు అందరి చూపు ఇద్దరు హీరోయిన్ల పైనే ఉంది. అయితే ప్రస్తుతం గీత గోవిందం ఫేమ్ పరశురాం అక్కినేని నాగచైతన్య కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.
అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు.. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది అని వార్త చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబుతో సినిమా ఆఫర్ రావడంతో దర్శకుడు పరశురామ్ నాగచైతన్య సినిమాలు డిలే చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. కానీ అలాంటిదేమీ లేదని తెలుస్తుంది. పరశురామ్ నాగచైతన్య సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది అని సమాచారం. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నాగచైతన్య కు జోడిగా టాలీవుడ్ బ్యూటీ క్వీన్ రష్మిక మందన ను సెలెక్ట్ చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు నిర్మాత అయిన అనిల్ సుంకర మాత్రం నాగచైతన్య సరసన పూజా హెగ్డే అయితే బాగుంటుందని అనుకుంటున్నారట.
ఎందుకంటే ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలతో సినిమాలు చేసి హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతుంది పూజా హెగ్డే. పూజా హెగ్డే ఈ సినిమాలో తీసుకుంటే పూజా హెగ్డే క్రేజ్ వల్ల కూడా ఈ సినిమాకు మరింత హైప్ అవుతుందని నిర్మాత అనిల్ సుంకర భావిస్తున్నట్లు సమాచారం. కానీ దర్శకుడు పరశురామ్ నాగచైతన్య కు జోడిగా రష్మిక మందన తీసుకోవాలి అనుకుంటున్నరట. ఎందుకంటే దర్శకుడు పరుశురాం కి రష్మిక సెంటిమెంట్ హీరోయిన్. గీత గోవిందం సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. దర్శకుడేమో రష్మిక మందన్న అంటుంటే... నిర్మాత అనిల్ సుంకర పూజా హెగ్డే అంటున్నారు మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది కొన్ని రోజుల్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.