తెలుగు సినిమాల్లో తనదై మార్కెట్ ను ఏర్పరచుకుని ఓదశలో వరుస హ్యాట్రిక్ హిట్లు సాధించిన హీరో నాని. నాచురల్ స్టార్ గా టాలీవుడ్ లో సహజ నటుడిగా పేరు సంపాదించాడు. అసిస్టెంట్ డైరక్టర్ నుంచి హీరోగా మారిన నాని వెరైటీ సబ్జెక్టులతో సినిమాలు చేస్తాడని పేరు తెచ్చుకున్నాడు కూడా. ప్రస్తుతం మూడు సినిమాలు లైన్ లో పెట్టిన నాని ఇప్పుడు మరో సినిమాను కూడా పైప్ లైన్లో పెట్టాడని ఫిలింనగర్లో ఓ వార్త రౌండ్ అవుతోంది.

 

 

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ సినిమాకు నాని చేయడానికి సైన్ చేశాడని సమాచారం. గతేడాది సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో బ్రోచేవారు ఎవరురా అనే కిడ్నాప్ డ్రామా తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. నానికి వివేక్ చెప్పిన లైన్ నచ్చిందని వెంటనే నాని ఓకే చెప్పాడని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న కమిట్ మెంట్లు పూర్తయ్యాక ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఈలోపు పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయాలని వివేక్ కు నాని సూచించాడని అంటున్నారు.

 

 

ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వి, శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ సినిమాలు చేస్తున్న నాని శ్యామ్ సింగరాయ్ అనే సినిమాను కూడా అనౌన్స్ చేశాడు. కొత్త హీరోలు వచ్చినా తమ మార్కెట్ పెంచుకున్నా తన మార్కెట్ ను స్థిరంగా ఉంచుకున్నాడు. ఈమధ్య ఫ్లాపులు ఎదురైనా నాని సినిమాపై ప్రేక్షకుల్లోనూ, బిజినెస్ వర్గాల్లోనూ నాని సినిమాకు క్రేజ్ ఉంది. ఈ వార్తపై అఫిషియల్ కన్ఫర్మేషన్ మైత్రీ మూవీస్ యూనిట్ గానీ నాని గానీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మైత్రీలో నాని గ్యాంగ్ లీడర్ సినిమా చేసిన విషయం తెలిసిందే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: