నందమూరి హీరోలు మారాల్సిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గాడిలో పడ్డా.. బాబాయ్ బాలయ్య, అబ్బాయి కళ్యాణ్ రామ్ ట్రాక్ ఛేంజ్ చేయాలనే టాక్ వినిపిస్తోంది. మిగతా హీరోలు ట్రెండ్ సెట్ చేస్తుంటే నందమూరి హీరోలు మాత్రం ఇంకా రొటీన్ ఫార్ములా ఫాలో అవుతున్నారు. 

 

హీరోలందరూ కొత్త కథల వెంట పరుగులు తీస్తున్నారు. కథ బాగా లేకపోతే పెద్ద  దర్శకుడిని అయినా తిరస్కరిస్తున్నారు. మహేశ్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి హీరోలు న్యూఏజ్ సినిమాల వైపు టర్న్ తీసుకున్నారు. కథల ఎంపిక విషయంలో అలర్ట్ అయ్యారు. కానీ నందమూరి కాంపౌండ్ ఈ విషయంలో బాగా వెనుకబడి ఉందనే ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. 

 

ఓ వైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలివైన ఎంపికలతో స్కై ఈజ్ లిమిట్ గా దూసుకెళ్తుంటే బాలయ్య.. కళ్యాణ్ రామ్ రొటీన్ మాస్ మసాలా కథలే పట్టుకొని వేలాడుతున్నారు. వరుస ఫ్లాపులతో డీలా పడిపోతున్నారు. ఇప్పటికే వరుస ఫ్లాపులతో బాలయ్య మార్కెట్ ఢీలా పడిపోయింది. ఔట్ డేటెడ్ కథలతో బాలయ్య ఔట్ డేటెడ్ అవుతున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫార్ములా కథలను పదేపదే రిపీట్ చేస్తూ బాలయ్య ఆడియన్స్ ను విసిగిస్తున్నాడు. 

 

ప్రస్తుత ట్రెండ్ కు ఆదిత్య 369 లాంటి సినిమాలు చేసే ఛాన్స్ ఉన్న బాలయ్య ట్రై చేసిందే లేదు.  మరోసారి మాస్ మసాలా డైరెక్టర్ బోయపాటి శ్రీనుతోనే సినిమా చేస్తున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ నటుడిగా పరిణతి చెందిన కథల విషయంలో మాత్రం ఇంకా సరైన డెసిషన్స్ తీసుకోలేకపోతున్నాడు. మధ్యలో 118 లాంటి సినిమా చేసిన మళ్లీ ఎంత మంచివాడవురా లాంటి మూస సినిమా చేసి నిరాశపరిచాడు. మరి ఈ ఇద్దరు హీరోలు యంగ్ టైగర్ చూసైనా... నేర్చుకుంటారేమో చూడాలి. చూద్దాం బాలయ్య ఏం చేస్తారో..కొత్తదనం చూపిస్తారో.. లేక రొటీన్ తో ప్రేక్షకులను విసిగిస్తారో.

మరింత సమాచారం తెలుసుకోండి: