పవన్ కళ్యాణ్..సినీ ఎంట్రీ అన్న చాటు తమ్ముడుగానే ఇచ్చాడు. తరువాత మాత్రం తనదైన స్టైల్లో దూసుకువచ్చాడు. మెగా పవర్ స్టార్ గా కొత్త అవతారం ఎత్తీఅశాడు. ఓ విధంగా చిరుతో పోలిక పెట్టలేని ఇమేజ్ పవన్ సొంతం. టాలీవుడ్లో సూపర్ స్టార్ డం కిరీటం పెట్టుకోవడానికి మెగాస్టార్ కి రెండు దశాబ్దాలు పడితే పవర్ స్టార్ కి పదేళ్ళు గట్టిగా పట్టలేదు.

 

ఒక టైంలో యూత్ ఐకాన్ గా పవన్ నిల్చాడు. ఆ మధ్య రాజకీయాల్లో సీరియస్ గా ఉన్నా కూడా ఇపుడు పవన్ మళ్ళీ సినిమాల వైపు చూపు సారించాడు. ఏకమొత్తంగా రెండు ప్రాజెక్టులను చేసేస్తూ తన దూకుడు చూపిస్తున్నాడు. పింక్ హిందీ రీమేక్ మూవీ పవన్ మొదటిదైతే రెండవది క్రిష్ డైరెక్షన్లో ఓ జానపద మూవీ అంటున్నారు.

 

మూవీ విషయంలోనే ఇపుడు ఇంటెరెస్టింగ్ అప్డేట్స్ వస్తున్నాయి. ఈ మూవీని పీరియాడికల్ మూవీగా క్రిష్ తీస్తున్నాడుట. అంతే కాదు ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా స్పాన్ పెంచి మరీ బాలీవుడ్ ని  టార్గెట్ చేస్తున్నారుట. ఈ మూవీలో ఒక హీరోయిన్ గా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ చేస్తోందట. అలాగే విలన్ గా అర్జున్ రాంపాల్ ని తీసుకుంటున్నారుట.

 

అలగే బాలీవుడ్ టెక్నికల్ టీం తో పాటు మరికొంత మంది నటులను కూడా తీసుకుని దీన్ని బాలీవుడ్ మెచ్చేలా తీస్తున్నారుట. ఈ మూవీని ఒకనాటి భారీ నిర్మాత ఏ ఎం రత్నం నిర్మించడంతో నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ లేదు. అదే విధంగా ఖర్చుకి కూడా వెనకాడడంలేదుట.

 

మొత్తానికి రీ ఎంట్రీతోనే పాన్ ఇండియా మూవీపైన పవర్ స్టార్ కన్నేయడం ఇపుడు పెద్ద చర్చగా ఉంది. టాలీవుడ్ నుంచి ఇప్పటికి ప్రభాస్ ఒక్కడే ఆ ఫీట్ చేసి సక్సెస్ కొట్టాడు, చిరంజీవి సైరా మూవీ చేసినా బాలీవుడ్ లో డిజాస్టర్ అయింది. మరి అన్న గారి చేయలేనిది తమ్ముడు పవన్ చేసి చూపిస్తాడా అని ఫ్యాన్స్ కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా మూవీతో పవర్ స్టార్ హిట్ కొడితే ఆ కిక్కే వేరబ్బా అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: