సైరా తరువాత మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో తన 152 వ చిత్రంలో నటిస్తున్నాడని తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాగా ప్రస్తుతం హైదరాబాద్ లో రెండవ షెడ్యూల్ జరుగుతుంది. సోషల్ మెసేజ్ తో కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆచార్య అనే టైటిల్ అనుకుంటున్నారట.
 
ఇదిలాఉంటే గత కొన్నిరోజులుగా ఈ సినిమా తరుచూ వార్తల్లో నిలుస్తుంది. దానికి కారణం ఈ చిత్రంలో రామ్ చరణ్ చేయాల్సిన పాత్రను సూపర్ స్టార్ మహేష్ బాబు చేయనున్నాడని ప్రచారం జరుగుతుంది. కొరటాల, మహేష్ కు క్లోజ్ కావడంతో ఈ సినిమాలో నటించమని ఒప్పించాడట, ఇందులో మహేష్ పాత్ర 30 నిమిషాల వుండనుందట అయితే ఇప్పటివరకు మాత్రం దీని గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.  మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. 
 
ఇక మహేష్ నటించడం ఏమో కానీ ఓ బాలీవుడ్ స్టార్ యాక్టర్ మాత్రం ఈచిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నాడట..  ఈవిషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించాడు. ఇంతకీ అతనెవరో కాదు టాలీవుడ్ లో చాలా సినిమాల్లో ప్రతినాయకుడి గా నటించిన సోనుసూద్.. మెగా స్టార్ తో మెదటి సారి కలిసి నటిస్తునందుకు చాలా గర్వంగా ఉందని తాజాగా సోను ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్టు 14న ఈ సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకరావడానికి  సన్నాహాలు చేస్తున్నారు. ఇక వరుస బ్లాక్ బాస్టర్ల తో ఫెవరేట్ డైరెక్టర్ గా మారిన కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం కావడం తో ఈ 152 మూవీ పై భారీ అంచనాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: