కొన్నాళ్ల క్రితం సినిమా పరిశ్రమకు హీరోయిన్లుగా వచ్చిన వారిలో కొందరు ఆ తర్వాత సినిమా కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లిళ్లు చేసుకుని హాయిగా తమ భర్తలు, పిల్లతో లైఫ్ ని లీడ్ చేస్తుండగా, ఇంకొందరు అప్పటి సీనియర్ నాయికలు మాత్రం ప్రస్తుతం తల్లి, పెద్దక్క వంటి పాత్రల్లో నటించడానికి ముందుకు వస్తున్నారు. ఆ విధంగా కొన్నేళ్ల క్రితం అటు తమిళ్, మలయాళం తో పాటు ఇటు తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి మంచి పేరు దక్కించుకున్న నటి నదియా. 

 

ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాతో నటిగా కొంత గ్యాప్ తరువాత రీఎంట్రీ ఇచ్చిన నదియా, ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అత్తారింటికి దారేది తో పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన బ్రూస్ లీ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. ఇక ఆ తరువాత నితిన్ హీరోగా తెరకెక్కిన అఆ తో పాటు రెండేళ్ల క్రితం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన నాపేరు సూర్య సినిమాలో కూడా నటించిన నదియా, తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. 

 

ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ తో కలిసి మిస్ ఇండియా తో పాటు ఓరు రాత్రి ఓరు పకల్ అనే మలయాళ సినిమాలో కూడా నటిస్తున్న నదియాకు ప్రస్తుతం తెలుగులో మరొక అద్భుత అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాక్సింగ్ నేపధ్య సినిమాలో నదియా ఒక కీలక పాత్రకు ఎంపికయ్యారట. సినిమాలో ఆమె పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు. కాగా గతంలో బాబాయి పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది సినిమాలో నటించిన నదియా, ప్రస్తుతం అబ్బాయి వరుణ్ తేజ్ తో కలిసి నటిస్తుండడంతో ఆ సినిమా మాదిరిగానే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాదిస్తుందని అంటున్నారు మెగా ఫ్యాన్స్.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: