వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరో నితిన్ కి భీష్మ సినిమా రూపంలో అదిరిపోయే హిట్ వచ్చింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. చాలా సంవత్సరాల తర్వాత నితిన్ కి సూపర్ హిట్టు సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పడటంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. కెరియర్ లో 'భీష్మ' సినిమాతో మళ్లీ కం బ్యాక్ వచ్చాడు ఇంకేంటి సూపర్ హిట్ కొట్టేశాము అని అనుకుంటున్నా నితిన్ అభిమానులకు మరియు నితిన్ కి చెమటలు పట్టే న్యూస్ ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేమిటంటే వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి పైరసీ ప్రాబ్లం పట్టుకుంది. కేవలం 3 రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి మంచి వసూళ్లు అందుకుంటున్న సమయంలో పైరసీ దెబ్బ చాలా గట్టిగా తగిలింది.

 

ఇప్పటికే పైరసీ దెబ్బకు సినీ పరిశ్రమ టెన్షన్ లో ఉంది .. అలాంటిది 'భీష్మ' వసూళ్లకు గండి కొట్టింది. తాజాగా ఆర్టీసీ బసు లో ఈ సినిమాను ప్రదర్శించడం అందరికి షాక్ ఇచ్చింది. ఇప్పటికే చాలా సినిమాలు విడుదలైన రెండో రోజే ఇలా టూరింగ్ బస్సుల్లో వేయడం మనం చూస్తున్నదే. తాజాగా 'భీష్మ' సినిమాకూడా పైరసీ అవ్వడం .. ఇలా బస్సుల్లో వేయడంతో ఓ అభిమాని ఈ ఫోటోను దర్శకుడు వెంకీ కుడుములు దృష్టికి సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్లడం జరిగింది.. దీంతో డైరెక్టర్ వెంకీ కుడుముల వెంటనే స్పందించి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు మా కష్టాన్ని వృధా చేయొద్దు అంటూ స్పందించి.

 

ఆ వెంటనే ఆ విషయాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ కు దృష్టికి సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్లటం జరిగింది డైరెక్టర్. దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్ ప్రభుత్వం తరుపున చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భంలో ఈ వీకెండ్ ‘హిట్’ రావడంతో పాటుగా అదిరిపోయే హిట్ అవడంతో ఎన్ని చర్యలు తీసుకున్నా 'భీష్మ' కి బ్యాడ్ డేస్ వచ్చేసినట్లే అని అంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: