హిందీ టెలి విజన్ సీరియల్ ఏక్ దుజే కే వాస్తే 2 తో స్మాల్ స్క్రీన్ కు పరిచయం అయిన బ్యూటీ కనికా కపూర్. తొలి సీరియల్ తోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తను ఎంచుకుంటున్న పాత్రల విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెర మీద తన పాత్ర మేకప్ వేసుకుందా లేక మేకప్ లేకుండా ఉందా అన్న విషయాలను నేను పట్టించుకోను. ఆ పాత్ర కథకు ఎంత కీలకం, ఆ పాత్రలో నాకు నటనకు ఎంత స్కోప్ ఉంది అన్న విషయాలు మాత్రమే నేను చూస్తా అంటోంది ఈ బ్యూటీ.
ఢిల్లీకి చెందిన భామ గతంలో బ్యూటీ క్వీన్ అవార్డ్ ను సైతం అందుకుంది. 2015 తెలుగు సినిమా టిప్పుతో యాక్టింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఆ బ్యూటీ. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆమె క్యారెక్టర్ ల ఎంపిక నటన ఇతర విషయాలు షేర్ చేసుకుంది. `నేను ఎప్పుడూ నటిస్తూ ఉండాలని కోరుకుంటా. నేను ఎంచుకునే పాత్రలు నా కెరీర్తో పాటు సమాజానికి కూడా ఎంతో కొంత మంచి చేయాలి లేదంటే నేను పాత్రల్లో నటించి ఏం ఉపయోగం.
నాకు ఇండియన్ ట్రెడిషనల్ లుక్ లో కనిపించటం ఇష్టం. అలా అని నేను అన్ని సినిమాల్లో, సీరియల్స్ లో అలాగే కనిపించాలని కోరుకోను. అంతేకాదు తెర మీద నా పాత్ర ఎక్కువ మేకప్ తో ఉందా.. లేక అసలు మేకప్ లేకుండా ఉందా అని కూడా చూడను. ఆ పాత్ర కథకు ఎంత బలం ఇస్తుంది. నటిగా ప్రూవ్ చేసుకునేందుకు నాకు ఎంత అవకాశం ఇస్తుంది అన్న విషయాలు మాత్రం చూస్తాను` అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అంతేకాదు తాను నాగిని తరహా సూపర్ నేచురల్ పాత్రలో నటించలేనని చెప్పింది.