ప్రభాస్ నాగ్ అశ్విన్ తో సినిమా చేయబోతున్నాడు అని ప్రకటన రాగానే ఈ మూవీ కథ ఎలా ఉంటుంది అన్న కోణంలో ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ ప్రముఖులు కూడ తమ తమ మార్గాల ద్వారా ఈ సినిమా కథకు సంబంధించిన విశేషాలను సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీకి కథకు సంబంధించి బయటకు వచ్చిన ఒక లీక్ బాలకృష్ణ అభిమానులకు మాత్రమే కాకుండా బాలయ్యకు కూడ షాక్ ఇచ్చినట్లు టాక్. 


తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ కథ టైమ్ మిషన్ చుట్టూ తిరుగుతుందని లీకులు వస్తున్నాయి. 1990 ప్రాంతంలో బాలకృష్ణ సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో నటించిన ‘ఆదిత్య 369’ మూవీ అప్పట్లో సూపర్ హిట్. వాస్తవానికి ఈ సినిమాకు సీక్వెల్ తీసి అందులో బాలకృష్ణ తో పాటు మోక్షజ్ఞ లు నటిస్తారు అంటూ గతంలో వార్తలు కూడ వచ్చాయి అయితే ఆ ప్రాజెక్ట్ వాస్తవ రూపం దాల్చలేదు.


ఇప్పుడు అదే టైమ్ మిషన్ నేపధ్యంలో నాగ్ అశ్విన్ ప్రభాస్ తో మూవీ చేయడం ఒక విధంగా బాలయ్య అభిమానులకు ఊహించని షాక్. బాలయ్య ఆలోచనలలో ఉన్న ఇలాంటి మంచి సబ్జెక్ట్ ప్రభాస్ వైపు వెళ్ళిపోవడం చూసి నందమూరి అభిమానులు నిరుత్సాహ పడుతూ బాలయ్య అనవసరపు ఆలోచనలతో ఒక మంచి సబ్జెక్ట్ పోగొట్టుకున్నాడు అంటూ అభిమానులు నిట్టూర్పులు విడుస్తున్నారు.


ఇది ఇలా ఉండగా వచ్చే సంవత్సరం దసరా కు విడుదల చేయాలి అన్న టార్గెట్ లో నాగ్ అశ్విన్ ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగం పెంచినట్లు తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ గా రాబోతున్న ఈ టైమ్ మిషన్ కథ కొంత సేపు రాజుల కాలంలోకి వెళ్ళిపోయి తిరిగి ప్రస్తుత కాలానికి వస్తుంది. ఈ సినిమాకు విజువల్ ఎఫక్త్స్ అత్యంత కీలకం కావడంతో ఈ మూవీ సినిమా టోగ్రాఫర్ గా బాగా పేరున్న ఒక విదేశీ టెక్నీషియన్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ అంతా అమెరికా కెనడా దేశాలలో జరుగుతాయని అంటున్నారు..
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: