మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో కూడా ఒక మంచి పేరు ఉన్నది. రీ ఎంట్రీతో మెగాస్టార్ అదరగొట్టారు. మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150 అదిరిపోయింది. ఈ సినిమా తరువాత మెగాస్టార్ సైరా సినిమా చేసి మెప్పించారు. ఈ మూవీ మెగాస్టార్ కెరీర్ లో బెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. అయితే, బాలీవడ్ లో మాత్రం ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. దీనికి కారణాం ఉయ్యాలవాడ గురించి ప్రపంచానికి తెలియకపోవడమే.
ఈ సినిమా బాలీవుడ్ లో నిరాశ పరిచినా ఇప్పుడు యూనివర్సల్ సబ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మెగాస్టార్. ఆ సినిమానే గోవింద ఆచార్యా. అయితే టైటిల్ ఇంకా కన్ఫర్మ్ కాకపోయినా, చాలా కాలం నుంచి టైటిల్ ఇదే అని చెప్పి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. అందుకే ఈ సినిమాకు ఇదే టైటిల్ అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. కానీ, ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉన్నది.
ఇక ఇదిలా ఉంటె, మెగాస్టార్ సినిమాలో మహేష్ బాబు కూడా ఓ పాత్ర చేస్తుండటం విశేషం. ఇక్కడ ట్విస్ట్ ఏమంటే, ఈ సినిమాలో సూపర్ స్టార్ మరణిస్తాడట. ఇది మహేష్ అభిమానులు ఎంతవరకు జీర్ణం చేసుకుంటారు అన్నది తెలియాల్సి ఉన్నది. మహేష్ అభిమానులకు ఇది కొంత ఇబ్బందికరమైన అంశమే అయినప్పటికీ కథ డిమాండ్ దృష్ట్యా మహేష్ పాత్ర అలా మరణిస్తుందని, కానీ మహేష్ బాబు ఉన్నంత వరకు కూడా పాత్ర పరుగులు తీస్తుందని అంటున్నారు.
ఈ సినిమా కోసం మహేష్ బాబు దాదాపుగా 30 రోజుల కాల్షీట్ ఇచ్చారట. అమెరికా నుంచి తిరిగి వచ్చిన వెంటనే అయన సినిమాలోనటించబోతున్నారు . అభిమానులకు కావాల్సిన అన్ని రకాల కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. రామ్ చరణ్, మ్యాట్నీ మూవీస్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తుండగా కొరటాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఆగష్టు 14 వరకు ఆగాల్సిందే.