టాలీవుడ్ లో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ గురించి ఏ వార్త వచ్చినా సరే అభిమానులతో పాటుగా టాలీవుడ్ జనాలు కూడా ఎంతో ఆసక్తిగా వింటున్నారు. ఆ సినిమా భారీ బడ్జెట్ తో వస్తున్న నేపధ్యంలో సినీ పెద్దలు కూడా ఆ సినిమాకు సంబంధించి ఏ వార్త వచ్చినా సరే ఆసక్తిగా తిలకిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు రాజమౌళి. దీనితో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రానుంది.

 

ఇది పక్కన పెడితే ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నాడు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి, తెలంగాణా ప్రాంతానికి చెందిన కొమరం భీమ్ కలిస్తే ఏ విధంగా ఉంటుంది అనేదే ఈ కథ అన్న మాట. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా కోసం ఇద్దరు హీరోలు భారీగా పారితోషకం తీసుకుంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ కలిపి దాదాపు 120 కోట్ల పారితోషికం ఇస్తున్నారని అంటున్నారు. వాళ్ళ పాత్రలే సినిమాలో ఎక్కువగా ఉంటాయని టాక్. 

 

దీనితో పారితోషికం విషయంలో హీరోలు ఎక్కడా కూడా తగ్గడం లేదని, అటు నిర్మాత కూడా వారికి అంత మొత్తంలో ఇవ్వడానికి రెడీ అయినట్టు సమాచారం. ఇక రాజమౌళి పారితోషికం కూడా దాదాపుగా అంతే ఉంటుంది అనేది సిని జనాల మాట. ఇప్పటి వరకు ఇలాంటి సినిమా టాలీవుడ్ జనాలు చూడలేదు. కథ కూడా కొత్తగా ఉండటం, భారీ బడ్జెట్ తో రావడంతో గాసిప్స్ కూడా ఈ సినిమాపై ఎక్కువగానే వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఒకరు శ్రేయ, అలియ బట్, ఒలివియా మోరిస్.

మరింత సమాచారం తెలుసుకోండి: