తెలుగు సినిమాకి ప్రపంచ స్థాయి గుర్తింపు తేవడంలో రాజమౌళి పాత్ర ఎంత ఉందో ప్రభాస్ పాత్ర కూడా అంతే ఉంది. ఒక దర్శకుడిని నమ్మి ఐదేళ్ల సినిమా జీవితాన్ని ఇచ్చాడంటే, ఆ సినిమా పట్ల ఎంత అంకితభావం ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఐదేళ్ళ కష్టాన్కి తగిన ప్రతిఫలంగా ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. అవును.. ఇప్పుడు ప్రభాస్ కి ఉన్న ఫాలోయింగ్ కానీ, మార్కెట్ పరంగా ఉన్న స్టామినా కానీ మరే హీరోకి లేవు.

 

 

బాలీవుడ్ లో ఎంతో మంది సూపర్ స్టార్లు ఉండవచ్చు. కానీ ప్రభాస్ లాంటి ఆదరణ ఎవరికీ లేదు. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రభాస్ అందరికీ సుపరిచితుడే. అంతటా అతని ఫాలోవర్లే. సాహో సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో దెబ్బపడినా ఉత్తరాదిన బ్లాక్ బస్టర్ గా నిలవడానికి కారణం ప్రభాస్ మానియానే. ప్రస్తుతం రాధాక్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జాన్ చిత్రం కూడా పాన్ ఇండియా మూవీగానే తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

 

 

అయితే తాజాగా ప్రభాస్ నుండి తన 21వ సినిమా అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే. ఎవ్వరూ ఊహించని విధంగా మహానటి దర్శకుడయిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా ఒప్పుకోవడం ప్రభాస్ అభిమానులకి షాక్ ఇచ్చింది. ఈ విషయం బయటకి వచ్చినప్పటి నుండి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఎలా ఉంటుందని ప్రశ్నలు వేస్తూ, తమకు తామే ఊహించుకుంటూ ఒక అంచనాకి వచ్చేస్తున్నారు.  

 

 

అయితే ప్రభాస్ తో మూవీ అంటే ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో నే ఉంటాయి. ఈ విషయమై డౌట్ వచ్చిన ఒక నెటిజన్ నాగ్ అశ్విన్ ని ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటుందా అని అడిగాడు. దానికి నాగ్ అశ్విన్ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాల్ని ప్రభాస్ ఆల్రెడీ చేసేశాడు. ఇప్పుడు పాన్ వరల్డ్ రేంజ్ లో ఉంటుందని సమాధానం ఇచ్చాడు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో ఈ సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగాయి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: