ఈ మధ్య టాలీవుడ్ లో శ్రీరెడ్డి పేరు ఎక్కువగా వినపడుతుంది. వివాదాస్పద నటిగా పేరున్న శ్రీరెడ్డి ఈ మధ్య కాస్త దురుసు వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుత౦ ఆమె చెన్నై లో ఉంటూ అక్కడ సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. ఇక ఈ నేపధ్యంలోనే తెలుగు హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంది. రెండేళ్ళ క్రితం క్యాస్టింగ్ కోచ్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె అప్పటి నుంచి కూడా ప్రతీ రోజు ఏదోక వివాదంలో ఉంటూనే ఉన్నారు. తాజాగా ఆమె మరో వివాదంలో చిక్కుకున్నారు. 

 

సోషల్ మీడియాలో తనను శ్రీరెడ్డి తిట్టారు అంటూ ప్రముఖ డాన్స్ మాస్టర్ రాకేశ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇక అక్కడి నుంచి ఆమె ఆయన్ను టార్గెట్ గా చేసుకుని మరిన్ని విమర్శలు చేస్తూ వస్తుంది. ఒక ఇంటర్వ్యు లో ఆయన ఆమెపై వ్యాఖ్యలు చేసారు అనే కక్షతో ఆమె సోషల్ మీడియా లైవ్ లో తిట్టారు. రాకేశ్ మాస్టర్ జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా విమర్శలు చేసారు. దీనితో ఎన్టీఆర్ ఫాన్స్ రాకేశ్ మాస్టర్ ని టార్గెట్ గా చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఆయనపై పోస్ట్ లు పెట్టడమే కాకుండా ఆయనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. 

 

దీనితో రాకేశ్ మాస్టర్ శ్రీరెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, గత నెల 28వ తేదీన సాయంత్రం శ్రీరెడ్డి యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో తనను చంపుతానని బెదిరించిందని, అంతేకాదు ఆమె తన అనుచరులతో ఫోన్‌ చేయిస్తూ బెదిరిస్తోందని తనపై శ్రీరెడ్డి చెన్నై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిందని, అక్కడి పోలీసులను హైదరాబాద్‌కు పంపించి చెన్నైకి ఈడ్చుకువచ్చి తనను అక్కడి పోలీసులతో కొట్టిస్తానని కూడా హెచ్చరిస్తోందని జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను అపార్థం చేసుకున్న ఆయన అభిమానులు.. అభిమాన సంఘం పేరుతో బెదిరింపులతో పాటు, అసభ్యకరమైన మాటలతో వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరికొందరు మూడు రోజుల్లో చంపుతామంటూ హెచ్చరిస్తుండటంతో వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని బంజారా హిల్స్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: