తెలుగు లో ‘చిత్రం’ మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు తేజ.  ఆ తర్వాత నితిన్, సదా హీరోహీరోయిన్లుగా ‘జయం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు.  అప్పట్లో ఈ చిత్రం ఓ ట్రెండ్ సృష్టించింది.  దాంతో స్టార్ దర్శకుల్లో ఒకరిగా తేజ మారిపోయాడు.  కానీ బ్యాడ్ లక్ తర్వాత తేజ తీసిన ఒక్క చిత్రం కూడా హిట్ కాదు కదా.. కనీసం కంటికి కూడా కనిపించని స్థాయిలో వచ్చాయి.  దాంతో కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చాడు.  ఆ మద్య రానా, కాజల్ జంటంగా ‘నేనే రాజు .. నేనే మంత్రి’ పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు తేజ.  ఈ చిత్రం అనూహ్యమైన విజయం అందుకుంది. దాంతో తేజ ఇక లైన్లోకి వచ్చాడని భావించారు. 

 

కానీ బెల్లంకొండ శ్రీను, కాజల్ తో తీసిన ‘సీత’ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.  తాజాగా తేజ దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్ లో జయం చిత్రం సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల  తేజ రెండు చిత్రాల్ని ప్ర‌క‌టించారు. త‌ను చేయ‌బోతున్న రెండు సినిమాల టైటిల్స్‌తో పాటు అందులో న‌టించ‌నున్న హీరోల వివ‌రాల్ని వెల్ల‌డించారు. ఇందులో `అలిమేలు మంగ వెంక‌ట ర‌మ‌ణ‌` చిత్రాన్ని హీరో గోపీచంద్‌తో చేయ‌బోతున్నారు. మరొక చిత్రం రానాతో తీయబోతున్న విషయం తెలిసిందే. గోపిచంద్ తో తీసే చిత్రంలో కాజల్ హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. 

 

ఇప్పటికీ కాజల్ తేజ దర్శకత్వంలో లక్ష్మీకళ్యాణం, నేనే రాజు నేనే మంత్రి, సీత లో నటించింది.  మరో సారి తేజ గోపీచంద్ సినిమాలో కూడా కాజల్ ను తీసుకున్నారని ప్రచారం జరిగింది. తాజాగా మరో హీరోయిన్ పేరు వినిపిస్తుంది.  నేను  శైలజ, నేను లోకల్, మహానటితో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన కీర్తి సురేష్ ని తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలపై చిత్రయూనిట్ అధికార ప్రకటన చేసేంతవరకు ఎదురుచూడాల్సిదే..  

మరింత సమాచారం తెలుసుకోండి: