ఈ మద్య కోలీవుడ్ లో ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుంది. షూటింగ్ లో ఎన్ని భద్రతలు తీసుకుంటున్నా ఎక్కడో అక్కడ చిన్న ఇబ్బందులు తలెత్తి ప్రమాదాలు జరుగుతున్నాయి.  యాక్షన్ సన్నివేశాల్లో అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి... వీటిని పెద్దగా ఎక్స్ పోజ్ చేయరు.  కానీ ఆ మద్య కన్నడ నాట ఓ యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్న సమయంలో ఇద్దరు ఫైటర్లు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు.  అప్పట్లో ఈ విషయం పెద్ద సెన్సేషన్ అయ్యింది.  షూటింగ్ జరిగే సమయంలో జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం కూడా హెచ్చరించింది.  తాజాగా ప్రముఖ దర్శకులు శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్, కాజల్ జంటగా నటిస్తున్న ‘భారతీయుడు 2’ షూటింగ్ లో క్రేన్ పడిపోయి ముగ్గురు ప్రాణాలు.. పదిమంది వరకు గాయపడ్డారు. 

 

ఈ విషాద ఘటన ఇప్పటికీ నటులు, దర్శకుడు మరువలేక ఉన్నామని అంటున్నారు.  కమల్ హాసన్ చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు కూడా ప్రకటించారు. అంతేకాదు వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.. ఇందుకు లైకా సంస్థ హామీ ఇస్తేనే షూటింగ్ లో పాల్గొంటానని కండీషన్ కూడా పెట్టారు.  అప్పటి వరకు తనతో షూటింగ్ లో పాల్గొన్న వారు ఒక్కసారే కనిపించకుండా పోవడం ఆ షాక్ నుంచి ఇప్పటికీ కాజల్ కోలుకోలేదని సమాచారం.  భారతీయుడు 2 లాంటి భయంకర ఘటన మరువక ముందే..  మరో ప్రమాదం జరిగింది. షూటింగ్‌ సెట్‌లో మంటలు చెలరేగి దాదాపు రూ.20 లక్షల నష్టం వచ్చింది.

 

వేలాయుధం కాలనీలోని పారామౌంట్‌ స్టూడియో వెనుక భాగంలో మంటలు చెలరేగిన విషయాన్ని గమనించిన వాచ్‌మన్‌ వెంటనే ఫైరింజన్‌ సిబ్బందికి ఫోన్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ప్రమాద విషయం తెలియగానే రెండు ఫైర్ ఇంజన్లు అక్కడకు వచ్చి దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు.  ఈ చిత్రం కోసం వేసిన సెట్, సామగ్రి కాలిపోయినట్లు అక్కడి సిబ్బంది మీడియాకు వివరించారు. అయితే ప్రాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని వారు అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: