ఈనగరానికి ఏమైంది ?, ఫలక్ నుమా దాస్ తరువాత యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ హిట్. నిన్న విడుదలైన ఈ చిత్రం యబో యావరేజ్ రివ్యూస్ ను రాబట్టుకొంది. ఫస్ట్ హాఫ్ ఆకట్టుకోగా సెకండ్ హాఫ్ మాత్రం యావరేజ్ అనిపించుకుంది. దాంతో సినిమాకు యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ రాలేదు. అయితే మొదటి రోజు మాత్రం ఊహించని విధంగా వసూళ్లను రాబట్టి ఆశ్చర్యపరిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటి రోజు 1.32కోట్ల షేర్ ను రాబట్టిందని సమాచారం .. మరో 3కోట్ల వసూళ్లను రాబడితే బ్రేక్ ఈవెన్ కానుంది. మరో వారం ఇదే జోరు ను కొనసాగిస్తే 'హిట్' అయ్యినట్లే.
నేచురల్ స్టార్ నాని , ప్రశాంతి త్రిపురనేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో రుహాణి శర్మ హీరోయిన్ గా నటించగా వివేక్ సాగర్ సంగీతం అందించాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేశాడు.
హిట్ మొదటి రోజు వసూళ్ల వివరాలు :
నైజాం - 67 లక్షలు
సీడెడ్ - 13 లక్షలు
ఉత్తరాంద్ర - 12 లక్షలు
గుంటూరు - 15.6 లక్షలు
కృష్ణా - 8 లక్షలు
నెల్లూరు - 3.5 లక్షలు
తెలుగు రాష్ట్రాల్లో మొత్తంమొదటి రోజు షేర్ = 1.32 కోట్లు