టాలీవుడ్ లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లు చాలా మంది తెలుగు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. అందాలతో పాటుగా సినిమాలు ఎక్కువగా చేస్తుండటంతో వారికి మంచి పేరు కూడా దక్కుతుంది. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో చాలామంది కన్నడ అమ్మాయిలు రాజ్యమేలుతున్నారు. ఆ క్రమంలో వచ్చిన అందాలా బ్యూటీ జేజెమ్మ అరుంధతి.. అనుష్క.. 


 

 

సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ అందాల తార అనుష్క మొదటి సినిమానే సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున సరసన నటించిన ఈ అమ్మడు ఆ సినిమాతో మంచి పేరును దక్కించుకుంది. ఆలా వరుస సినిమాలలో నటించిన అమ్మడు ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. ప్రముఖ దర్శకుడు రూపొందించిన అరుంధతి సినిమా ద్వారా  గుర్తింపు తెచ్చుకుంది. 

 

 


ఆ తర్వాత వచ్చిన సినిమా బాహుబలి.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది. ఈ సినిమాలో  పాత్రలో కనిపించిన అనుష్క ఒక్క భారత  ఇతర దేశాల్లో కూడా మంచి అభిమానులను దక్కించుకుంది. అలా భాగమతి వంటి అద్భుతమైన సినిమాలలో నటించిన ఆమె ఎందరో ఫ్యాన్స్ ను పోగేసుకుంది. 

 


అయితే అనుష్క సినిమాలు తెలుగు లో రాలేదన్న విషయం తెలిసిందే . మొదటి సినిమా ఆఫర్ ఇప్పిచ్చిన కింగ్  నాగార్జున వల్లనే ఇప్పుడు తెలుగు సినిమాల లో ఛాన్సులు రాకపోవడానికి కారణం అయ్యాడని మాటలు వినపడుతున్నాయి. అందుకే సినిమాల లో అవకాశాలు రాలేదని అంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం అనుష్క తమిళ చిత్రాల లో నటిస్తుంది. నిశ్శబ్దం సినిమాలో నటిస్తుంది ఈ సినిమా విడుదల కు సిద్దమవుతుంది.ప్రముఖ నటుడు మాధవన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్ర టీజర్ ట్రైలర్  ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమా కూడా ఆకట్టుకుందని అభిప్రాయపడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: