లోక నాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ఇండియన్‌ 2. ఒకప్పటి సూపర్‌ హిట్ సినిమా ఇండియన్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ లోకేషన్‌లో భారీ ప్రమాదం జరిగిన సంఘనట తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పాయారు. దర్శకుడు శంకర్, హీరో కమల్‌ హాసన్‌, హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌లో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

 

ఈ భయానక సంఘటన కారణంగా ఇండస్ట్రీలో కలవరం మొదలైంది. అసలు షూటింగ్ లోకేషన్లలో సేఫ్టి మేజర్స్‌ ఏ స్థాయిలో ఉన్నాయి. అక్కడ పనిచేసే వారికి ఎలాంటి రక్షణ, భరోసా కల్పిస్తున్నారు లాంటి అంశాలు తెర మీదకు వచ్చాయి. ఈ ప్రమాదం తరువాత పలువురు హీరోలు, నిర్మాతలు తమ సినిమాలకు పరిచేసేవారికి భీమా కల్పించేందుకు ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే శింబు మానాడు చిత్రయూనిట్.. లోకేషన్‌లో పనిచేసే అందరికీ భీమా కల్పిస్తున్నట్టుగా ప్రకటించారు.

 

అయితే ఇండియన్‌ 2 లోకేషన్‌లో యాక్సిడెంట్ ఘటన దర్శకుడు శంకర్‌ను తీవ్రంగా కలచి వేసింది. అందుకే ప్రమాదం జరిగిన తరువాత కొద్ది రోజుల పాటు షాక్‌లో ఉండిపోయిన శంకర్ ఘటనపై స్పందించలేదు. కాస్త ఆలస్యంగా స్పందించిన ఆయన ప్రమాదంలో క్రేన్‌ తన మీద పడి ఉన్నా బాగుండేది అని, ఎంతో మంచి సహచరులను కోల్పాయానని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఆయన ప్రమాదంలో మరణించిన వారికి భారీ పరిహారం ప్రకటించాడు. వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున అందజేస్తున్నట్టుగా తెలిపాడు శంకర్‌. ఇప్పటికే కమల్‌ హాసన్‌ కూడా కోటీ రూపాయల చొప్పున పరిహారం ప్రకటించగా లైకా సంస్థ 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: