మాయ చేసావె.. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమాలో సమంత.. నాగ చైతన్య ప్రేమ అంత అద్భుతంగా పండింది. వారి సైలెంట్ లవ్ కారణంగా సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికి ఆ సినిమా అంటే ఎంతోమందికి ఇష్టం. 

 

అయితే ఆ సినిమా వచ్చి ఇప్పటికే 10 సంవత్సరాలు గాచిపోయింది. ఇన్నాళ్లు అయినా ఆ సినిమాకు సీక్వెల్ చెయ్యాలి అని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఈసారి ఏమైందో తెలియదు కానీ సినిమాకు సీక్వెల్ చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నారట.. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన గౌతమ్ మీనన్ కి తెలుగు .. తమిళ భాషల్లో దర్శకుడిగా మంచి పేరు వుంది. 

 

ప్రేమకథా చిత్రాలను చక్కని ఫీల్ తో తెరకెక్కించే గౌతమ్ మీనన్ పదేళ్ల క్రితం తమిళంలో రూపొందించిన 'విన్నైతాండి వరువాయ' సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో శింబు కథానాయకుడిగా నటించగా కథానాయికగా త్రిష నటించింది. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. 

 

తెలుగులోను ఆ సినిమాను 'ఏ మాయ చేసావె' టైటిల్ తో రూపొందించగా, ఇక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. నాగ చైతన్య జోడీగా సమంత నటించి ఈ సినిమా వారిద్దరి కెరీర్ కి పునాది అయ్యింది. అయితే తమిళంలో ఒరిజినల్ సినిమాకు సీక్వెల్ చేయాలనే నిర్ణయానికి గౌతమ్ మీనన్ వచ్చాడు. 

 

'విన్నైతాండి వరువాయ 2'కి కథను సిద్ధం చేశాను. శింబు ఓకే అంటే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది' అని ఆయన అన్నాడు. ఈ సినిమాలో శింబు జోడీగా అనుష్కను తీసుకోవాలని అనుకుంటున్నట్టు సమాచారం. తమిళంలో సెట్ అవుతే తెలుగులోను సీక్వెల్ వచ్చే వచ్చేస్తుంది. అయితే తెలుగులో ఏ హీరో, హీరోయిన్ ని తీసుకుంటారు అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: