బాలీవుడ్ ఇండస్ట్రీలో క్వీన్ గా పిలవబడే దీపికా పడుకొణే నటించడంలో దిట్ట. ఆమె ఎంత క్లిష్టమైన పాత్రనైనా అలవోకగా చేసేస్తోంది. ఇటీవల విడుదలైన చ్ఛపక్ సినిమాలో ఒక యాసిడ్ బాధితురాలి పాత్రని అద్భుతంగా పోషించి అందర్నీ ఆశ్చర్య పరిచింది. మరి అటువంటి మహానటి ఫుల్ క్రేజ్ ఉన్న ప్రభాస్ తరఫున నటిస్తుందంటే అది ప్రభాస్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రభాస్ చిత్రాన్ని హిందీలో డబ్ చేస్తే దీపికా కోసమైనా కోట్ల మంది థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది.

 

 

సో ప్రభాస్, నాగ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పడుకొణే ని హీరోయిన్ గా నటింపచేయాలని ఆ సినీ బృందం అనుకుంటున్నారట. అందుకే తాజాగా ఆ చిత్ర యూనిట్ దీపికా పడుకొణే ని సంప్రదించి ప్రభాస్ సరసన నటిస్తారా? అడిగారట. అయితే ఆమె ఈ ఆఫర్ పై ఇంకా పెదవి విప్పలేదట.




ఇకపోతే ఈ సినిమాని అశ్వినీ దత్ నిర్మిస్తున్నాడు. ఇతను ఏ సినిమా చేసినా భారీ బడ్జెట్ తోనే తీస్తాడు. దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ నెక్స్ట్ సినిమా భారీ బడ్జెట్ తో వస్తుందని ఊహించవచ్చు. అలాగే ప్రభాస్ సూపర్ హీరో లాగా ఈ సినిమాలో కనిపించనున్నాడట.ఈ సినిమాలో తారాగణం చూసుకుంటే అందరూ ప్రఖ్యాత చెందిన నటులేనట. జాన్ సినిమా షూటింగ్ అయిపోగానే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

 

నాగ అశ్విన్ సావిత్రి బయోపిక్ మహానటి సినిమా వెండి తెరకెక్కించి ఎన్నో అవార్డులను అందుకున్న విషయం తెలిసిందే. ఇతని దర్శకత్వంలో ప్రభాస్ నెక్స్ట్ సినిమా అంటే దాని పై అంచనాలు బాగానే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. దీపికా సినీ కెరియర్ గురించి చెప్పుకోవాలంటే ఆమె ప్రస్తుతం క్రికెట్ డ్రామా 83 చిత్ర షూటింగ్ లో చాలా బిజీగా ఉంది. మరి దీపికా ప్రభాస్ తో రొమాన్స్ చేసేందుకు ఒప్పుకుంటుందా లేదో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: