ఈ మద్య బాలీవుడ్ లో చాలా కాలం కాపురం చేసిన కొంత మంద నటీ నటులు వైవాహిక జీవితాల్లో వస్తున్న అరమరికల వల్ల విడాకులు తీసుకుంటున్నారు.   కొంకణా సేన్ శర్మ, ‘మైనే ప్యార్ కియా’ ఫేమ్ భాగ్యశ్రీ తమ భర్తలనుండి విడిపోయిన విషయం తెలిసిందే.  భాగ్యశ్రీ ప్రస్తుతం తెలుగు లో ఓ మూవీలో నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఆమె విడాకుల కారణం మాత్రం పెద్దగా ఎక్స్ పోజ్ కానివ్వడం లేదు.  మరో బాలీవుడ్ నటుడి భార్య విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.  టీవీ షోలతో పాటు ‘లగాన్‌’, ‘సూయి ధాగా’, 'న్యూటన్', ‘పిప్లీ లైవ్‌’ వంటి చిత్రాల్లో ప్రముఖ పాత్రల్లో నటించిన రఘుబీర్‌ యాదవ్‌ మాజీ భార్య పూర్ణిమా ఖర్గా మరోసారి కోర్టు తలుపు తట్టారు.

 

32 ఏళ్ల తర్వాత తన భర్త నుంచి విడాకులు కావాలని ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.  మరో మహిళతో వివాహేతర సంబంధం నడుపుతూ తనని రఘుబీర్‌ మోసం చేశాడని ఆరోపించారామె. నటుడు సంజయ్‌ మిశ్రా భార్య రోషిణి అచ్రేజాతో ఆయనకు వివాహేతర సంబంధం ఉందని, వారిద్దరికీ 14 ఏళ్ల కొడుకు ఉన్నట్లు ఆమె వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని ఆయనే స్వయంగా కోర్టుకు వెల్లడించారు.  నటి నందితా దాస్‌తో ప్రేమ పడ్డారని వెల్లడించారు.

 

‘రాజ్‌ భరోట్‌’ టీవీ సీరియల్‌లో నటించినప్పుడు వారిద్దరూ  ప్రేమించుకున్నారని తెలిపారు. అయితే గతంలో కూడా పూర్ణిమా ఖర్గా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించి, మనసు మార్చుకుని దరఖాస్తును వెనక్కు తీసుకున్నారు. భరణం కింద రఘుబీర్‌ నుంచి నెలకు రూ.40 వేలు అందుకుంటున్నారు పూర్ణిమ.  ప్రస్తుతం ఆ భరణం ఆమెకు రావడం లేదని ఆరోపించారు.  ఆస్తిని అచ్రేజా పేరు మీదకు బదిలీ చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.  అయితే తనకు భరణం కింద రూ.10 కోట్లు ఇప్పించి విడాకులు మంజూరు చేయాలని కోరారు. మరి ఈ విషయంపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: