సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సినిమా మొన్నటి సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయి మంచి సక్సెస్ ని అందుకున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు, మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆయన సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ చాలా రోజుల తరువాత మంచి ఎంటర్టైన్మెంట్ తో కూడిన పాత్రలో నటించడంతో ఆయన ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసేందుకు ఎంతో ఆసక్తి కనబరిచారు. 

 

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి దాదాగాపుగా 13 సంవత్సరాల గ్యాప్ తరువాత ఈ సినిమా ద్వారా సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంతో పాటు, ఇందులో ప్రొఫెసర్ భారతి అనే పాత్రలో ఆమె అద్భుతంగా నటించి మెప్పించారు. మురళి శర్మ, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, బండ్ల గణేష్, ప్రకాష్ రాజ్, రఘు బాబు, అజయ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాని మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు అనిల్ తెరకెక్కించడం జరిగింది. ఇకపోతే నేటితో ఈ సినిమా దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. 

 

ఓ వైపు నిర్మాత అనిల్ సుంకర, మరో వైపు సూపర్ స్టార్ మహేష్, అలానే దర్శకుడు అనిల్ రావిపూడి ముగ్గురూ కూడా తమ సినిమా అర్ధ శతదినోత్సవం జరుపుకోవడంపై ఆనందం వ్యక్తం చేస్తూ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఇంత మంచి విజయాన్ని తమకు అందించినందుకు అభిమానులకు, ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఈ సినిమా అర్ధ శతదినోత్సవ కేంద్రాల్లో సూపర్ స్టార్ ఫ్యాన్స్ అన్నదానం, పండ్లు పంచడం వంటి  పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక దీని తరువాత మహేష్ బాబు, మెగాస్టార్ తో కొరటాల తీస్తున్న సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం....!!! 

మరింత సమాచారం తెలుసుకోండి: