టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను, అలానే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి, ఇక ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుసగా మూడు విజయాలు అందుకుని హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు, ఒక మిలిటరీ మేజర్ గా నటించిన సరిలేరు సినిమాలో ఆయనకు జోడిగా రష్మిక నటించగా, ప్రముఖ సీనియర్ నటి విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు, తదుపరి చేయబోయే సినిమా విషయమై గత కొద్దిరోజులుగా పలు టాలీవుడ్ వర్గాల్లో పలు విధాలుగా వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. 

 

ముందుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ ఒక సినిమా చేస్తారని ఇటీవల వార్తలు రావడం, అయితే వంశీ చెప్పిన స్టోరీ పూర్తి స్క్రిప్ట్ సిద్ధం కాకపోవడంతో, అదే సమయంలో తనకు బౌండెడ్ స్క్రిప్ట్ ని వినిపించి ఒప్పించిన మరొక దర్శకుడు పరశురామ్ పెట్లకు మహేష్ పచ్చ జెండా ఊపినట్లు చెప్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ గా ఈ సినిమా అతి త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు టాక్. ఇక మరోవైపు దర్శకుడు కొరటాల శివ, మెగాస్టార్ ల కేజ్రీ కాంబోలో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలో మహేష్ ఒక కీలక పాత్రలో నటించనున్నారని, ఆ సినిమా విషయమై ఇటీవల కొరటాల ఇచ్చిన న్యారేషన్ మహేష్ కు నచ్చి ఆ పాత్ర చేయడానికి ఓకే చెప్పారని అంటున్నారు. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించి మరొక రెండు రోజుల్లో కీలక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. 

 

కాగా పరశురామ్ తన సినిమా కథ వినిపించే సమయంలోనే హీరోయిన్ ని కూడా ఎంపిక చేసి మహేష్ కు చెప్పినట్లు సమాచారం. ఆమె మరెవరో కాదు రష్మిక అని అంటున్నారు. గతంలో విజయ్ తో తాను తీసిన గీత గోవిందంలో ఆమె హీరోయిన్ కావడం, అలానే ఇటీవల మహేష్ తో ఆమె చేసిన సరిలేరు లో కూడ సూపర్బ్ గా యాక్టింగ్ అదరగొట్టడంతో పాటు, ముఖ్యంగా తన సినిమాలోని పాత్ర ఆమెకు అయితే సరిగ్గా సరిపోతుందని భావించి పరశురామ్ ఆమెను తీసుకోవాలని నిర్ణయించినట్లు గట్టిగా వార్తలు వస్తున్నాయి. ఇక మొత్తంగా మహేష్ తదుపరి సినిమాల సంగతుల వివరాలు మరొక రెండు రోజుల్లో చాలావరకు వెల్లడి అయ్యే అవకాశం ఉందట....!!

మరింత సమాచారం తెలుసుకోండి: