టాలీవుడ్ లో దర్శకుడి తేజ శైలి కంప్లీట్ గా వేరు. ఏ దర్శకుడు చేయనటువంటి సాహసాలు చేశారు. కేవలం చిత్రం సినిమాని 38 లక్షల్లో తీసి షాకిచ్చారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసందే. అయితే ఆ సినిమా నుండి దాదాపు ఆయన తీసిన చాలా సినిమాలకి అంతా కొత్తవాళ్ళని సెలెక్ట్ చేసుకొని ప్రయోగాలు చేసి సక్సస్ అయ్యారు. తేజ కొత్త వాళ్ళతో సినిమాలు తీసి ఎంతో మంది హీరో హీరోయిన్స్ ని పరిచయం చేశారు.

 

వాళ్ళలో కాజల్ అగర్వాల్, ఉదయ్ కిరణ్, అనిత, రీమా సేన్, నవదీప్, నితిన్ వంటి స్టార్స్ ఉన్నారు. అంతేకాదు ఈరోజు మాస్ హీరోగా ఎదిగిన గోపీచంద్ కూడా తేజ వల్లనే అన్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా తేజ కి సరైన హిట్ దక్కలేదు. ఇక చాలా గ్యాప్ తర్వాత నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్ళీ హిట్ కొట్టి సక్సస్ ట్రాక్ లోకి వచ్చారు. ఈ దర్శకుడు తేజ ప్రస్తుతం రెండు సినిమాల పేర్లని ప్రకటించి షాకిచ్చాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమా తో విజయాన్ని అందుకున్న తేజ.. ఆ తర్వాత మళ్ళీ ఫ్లాప్ ని చూశారు. 

 

ఆ తర్వాత ఉదయ్ కిరణ్ బయోపిక్ గురించిన వార్తలు వచ్చినప్పటికీ..ఆ వార్తల్లో నిజం లేదని అదంతా క్రియోటివ్ న్యూస్ అని క్లారిటి వచ్చింది. అయితే ప్రస్తుతం తేజ నుండి రెండు సినిమాలు రాబోతున్నాయి. 'అలివేలుమంగ వెంకట రమణ', 'రాక్షస రాజు రావణాసురుడు' అనే టైటిల్స్ తో రెండు సినిమాలు తేజ దర్శకత్వంలో తెరకెక్కబోతున్నాయని తాజా  సమాచారం. ఈ రెండు సినిమాల్లో హీరోలు ఎవరనేది మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. అయితే అలివేలుమంగ వెంకట రమణ కథకి గోపీచంద్ ని తేజ అనుకుంటున్నాడట. 

 

అయితే ఈ రెండు సినిమాలలో హీరో ఎవరో ఫిక్స్ కానప్పటికి ఈ సినిమాలో హీరోయిన్లు మాత్రం ఫిక్స్ అవుతున్నారు. అలిమేలు సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం కీర్తి సురేష్ కూడా నటిస్తుందట. అయితే కాజల్ స్థానంలో కీర్తిని తీసుకున్నారా లేదా కీర్తిని మరో హీరోయిన్ గా తీసుకున్నారా అనే విషయంలో మాత్రం ఇంకా పక్కా కన్ఫర్మ్ కాలేదు. ఇకపోతే రాక్షస రాజు రావణాసురుడు సినిమాలో రానా నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ రెండు సినిమాలలో గోపీచంద్, రానా హీరోలుగా తేజ సెలెక్ట్ చేసుకున్నారా లేదా ఇదంతా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లా అన్నది క్లారిటీ లేదు. కానీ కొంతమంది మాత్రం చక చకా హీరోయిన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ..మరి హీరోలెవరు అని అడుగుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: