బుల్లితెర‌పై జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్‌ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలుసు. ఈ షో చాలా మంది క‌మీడియ‌న్స్‌కే కాకుండా అటు నాగ‌బాబుకు ఇటు రోజాకు కూడా మంచి గుర్తింపు వ‌చ్చింది. అయితే జబర్ధస్త్ కామెడీ షోకు జడ్జ్‌గా గుడ్ బై చెప్పిన తర్వాత నాగబాబు.. జీ తెలుగులో ‘అదిరింది’ ప్రోగ్రామ్‌కు జడ్జ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జబర్దస్త్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తన కెరీర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు నాగబాబు. అయితే నవ్వుల నవాబుగా పేరున్నా కూడా అదిరిందిలో మాత్రం ఈయన మార్క్ చూపించడం లేదు. ఇప్పుడు ఈయనకు నిజంగానే ఇప్పుడు నాగబాబుకు అదిరిపోయే షాక్స్ త‌గులుతున్నాయి.

 

రేటింగ్స్ పరంగా అదిరింది బాగా వెనకబడిపోయింది. ఈ షోకు కనీసం మూడు రేటింగ్ కూడా రావడం లేదని తెలుస్తుంది.  ఇన్ని వారాలు గడిచినా జ‌బ‌ర్ద‌స్త్‌ను బీట్ చేయ‌డం కాదు క‌దా.. కనీసం ఓ మోస్త‌రు పోటీ కూడాఇవ్వ‌లేక‌పోవ‌డంతో నాగబాబు ఆలోచనలో పడుతున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే ఎంతో హంగామాతో ప్రారంభమైన ఈ షో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయిందని టీఆర్పీ రేటింగ్స్ చెప్పాయి. ఈ నేపధ్యంలో అదిరింది షో ఆగిపోతుందనే వార్తలూ ఇండస్ట్రీలో విప‌రీంగా హ‌ల్‌చ‌ల్ చేశారు. దాంతో జీ తెలుగు టీం నాగుబాబుతో చాలా ప్లాన్స్ వేస్తోంద‌ట‌. ముఖ్యంగా అంతా జబర్దస్త్ ఫార్మాట్‌లోనే ఈ షో కూడా సాగుతుంది. 

 

అక్కడ ఎలాగైతే అనసూయ, రష్మి అందాలు ఆరబోస్తున్నారో ఇక్కడ కూడా సమీరా అనే అమ్మాయిని తీసుకొచ్చారు. అయితే ఫామ్‌లో లేని ఈ బ్యూటీతో అదిరిందికి అస్సలు కలిసి రాలేదు. దాంతో జ‌బ‌ర్ద‌స్త్‌ను ఎలాగైనా కొట్టాల‌ని.. కావాల‌నే ఆమెను తప్పించేసిన‌ట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, ఆమె ప్లేస్‌లో ఏకంగా ఇద్దరు మంచి ప‌ట్టున్న‌ కొత్త యాంకర్స్ దింపారు. అదేనండీ యాంక‌ర్‌ రవి మ‌రియు బిగ్ బాస్ ఫేం బ్యూటీ భాను శ్రీ.. వీరిద్ద‌రినీ తీసుకువ‌చ్చారు. బిగ్ బాస్ సహా కొన్ని సినిమాలతో కూడా ఇప్పటికే భాను శ్రీ గుర్తింపు తెచ్చుకుంది. 

 

దాంతో పాటు అందాల ఆరబోతలో కూడా అమ్మడికి ఎక్కడా అడ్డు కూడా లేదు. అందుకే రెచ్చిపోవాలని చూస్తుంది భాను. దాంతో పాటు రవికి కూడా యాంకరింగ్‌లో మంచి ఇమేజ్ ఉంది. అందుకే నాగ‌బాబు మ‌రియు నిర్వాహ‌కులు ప‌క్కా ప్లానింగ్‌తో స‌మీరాను సైడ్ చేసి వీరిద్ద‌రినీ షోలోకి తీసుకువ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి నాగ‌బాబు ప్లాన్ ఫ‌లించి వీరితో అయినా ఈ షో జ‌బ‌ర్ద‌స్త్‌ను బీట్ చేస్తుందో.. లేదో.. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: