ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా గ్యాప్ త‌ర్వాత ఓ హిట్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన `పింక్‌` రీమేక్ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. అయితే ఈ చిత్రంతో పాటు క్రిష్ చిత్రం కూడా త్వ‌ర‌గా పూర్తి చేసి ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని ఆయ‌న ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక ఇదిలా ఉంటే ఇటీవ‌లె ఆయ‌న పూరి జ‌గ‌న్నాధ్ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఇవి కాక మ‌రో మూడు చిత్రాల‌కు ఆయ‌న సైన్ చేశారు. ఇక మెగా ఫ్యాన్స్ కు పండ‌గే అని చెప్పాలి. ఒకేసారి ప‌వ‌న్ నుంచి సినిమాల మీద సినిమాలు వ‌స్తున్నాయి.  అయితే ఏ సినిమాకి ఆయ‌న ఎక్కువ‌గా స‌మ‌యాన్ని కేటాయించ‌ద‌లుచుకోలేదు. ఎందుకంటే ఆయ‌న ఓ పక్క రాజ‌కీయాల‌తో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఓ ప‌క్క రాజకియాల్లో యాక్టివ్‌గా ఉంటూనే మ‌రో ప‌క్క సినిమాల్లో ఆయ‌న న‌టిస్తున్నారు.

 

ఇక పింక్ రీమేక్ కి వ‌కీల్ సాబ్ అనే టైటిల్ అనుకుంటున్నారు. మ‌రి దాదాపు అదే టైటిల్‌ని ఈ చిత్రానికి ఫిక్స్ చేసేలా ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ను త్వ‌ర‌లో విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంద‌ట‌. ఎప్పుడా అని అనుకుంటున్నారా మార్చి 2వ తారీఖున ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల కానుంద‌ని స‌మాచారం. అలాగే ఈ సినిమాని మేలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. మ‌రి దీని పై చాలా త్వ‌ర‌గా మిగిలిన ప‌నుల‌న్నీ పూర్తి చేసే బిజీలో ఉన్నారు దిల్‌రాజు, బోనీక‌పూర్.

 

ఈ చిత్రంలో అంజలి, నివేద థామస్ , అనన్య లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.  ఈ చిత్రాన్నివేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రం హైద్రాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నవిష‌యం తెలిసిందే. ఈ షెడ్యూల్‌ ఏప్రిల్ తో పూర్తీ అవుతుంద‌ని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: