ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ప్ర‌భాస్ రేంజ్‌ని అమాంతం పెంచేశాడు. బాహుబలి చిత్రం తర్వాత దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్. ఆ తరువాత కూడా  ఆయ‌న న‌టించే చిత్రాల‌న్నీ కూడా దాదాపు అదే స్థాయిలో భారీ చిత్రాలు చేస్తున్నారు. ఆయన గత చిత్రం సాహో 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కగా 420 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసింది. ఇక ప్రస్తుతం చేస్తున్న పీరియాడిక్ లవ్ డ్రామా సైతం ఎక్కువ బ‌డ్జెట్‌తోనే తెర‌కెక్కుతోంది. ఇక ఇదిలా ఉంటే... తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటు ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి, అటు నాగశ్విన్ ఫ్యాన్స్‌కి స‌డెన్ షాక్ ఇచ్చారు. వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ వాళ్ళు. 

 

నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని పలు భాషలలో భారీగా నిర్మించనున్నార‌ని స‌మాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఆల్రెడీ మొద‌ల‌యిపోయాయి.  ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఇదిలా ఉంటే... భారీ బడ్జెట్ చిత్రాలకు ప్రభాస్ కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోయార‌న‌డానికి ఎలాంటి అతిశ‌యోక్తిలేదు. ఇకపై ఆయన నుండి వచ్చే ప్రతి చిత్రం పాన్ ఇండియా లెవెల్ లోనే ఉంటుంది. హిందీలో ప్రభాస్ కి ఓ రేంజ్‌లో భారీ క్రేజ్ వ‌చ్చేసింది, సాహో ఫలితమే అందుకు నిదర్శన‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. కాబట్టి టాలీవుడ్ దర్శక నిర్మాతలలో ఎవరికైనా పాన్ ఇండియా సినిమా తీయాలంటే ఫస్ట్ ఛాయిస్ గా ప్రభాస్ నే అనుకుంటున్నార‌ట‌. 

 

 అయితే ఈ నాగఅశ్విన్ చాలా గ్యాప్ త‌ర్వాత ఈ సినిమాని తీస్తున్నారు. ఇంత గ్యాప్ తీసుకున్న నాగ అశ్విన్ ఎవ‌రితో సినిమా చేస్తారా అని ఎదురు చూస్తున్న వారంద‌రికీ  స‌డెన్ షాక్ ఇచ్చాడు.  ప్ర‌భాస్ ప్ర‌స్తుతం గోపిచంద్ జిల్ మూవీ డైరెక్ట‌ర్ రాధాకృష్ణ  ద‌ర్శ‌క‌త్వంలో ఒక చిత్రం తెర‌కెక్కుతుంది. ఆ చిత్రం ఆల్రెడీ మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుని నాలుగో షెడ్యూల్‌లోకి అడుగుపెడుతుంది. యు.వి. క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  మ‌రి ఈ వారం ప్ర‌భాస్ విశేషాలు ఇవి.

మరింత సమాచారం తెలుసుకోండి: