ఈవారం బాలీవుడ్ విశేషాలు చూసుకుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ని బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌ బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించాలని ఒత్తిడి తీసుకువస్తున్నట్లు అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఇటు టాలీవుడ్ లోనూ వార్తలు వస్తున్నాయి. ఎప్పటినుండో మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ పై రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. అవేమీ రియల్ కాలేదు. అయితే తాజాగా ఇటీవల ఓ వ్యాపార ప్రకటన బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌ తో మహేష్ బాబు నటించాడు. ఈ సందర్భంగా గత రెండేళ్లలో ఇలా వారిద్దరూ కలసి నటించడం ఇది మూడోసారి. అయితే ఈ సారి జరిగిన ముంబై షూట్ లో రణవీర్ సింగ్ ఏకంగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్ నీ తీసుకువచ్చి మహేష్ తో మాట్లాడించి భారీ మల్టీస్టారర్ సినిమా చేయటానికి ఆ సినిమా ప్యాన్ ఇండియా లెవెల్లో రూపొందించాలని ప్లాన్ చేశారట.

 

బీటౌన్ లో రణవీర్ కు భారీ క్రేజ్ ఉంది. అలాగే సౌత్ లో మహేశ్ సత్తా చాటగలడు. కాబట్టే ఈ ఇద్దరు స్టార్స్ ను కలిపితే ఇండియన్ బాక్సాఫీస్ దున్నేయొచ్చన్నది ఈ నిర్మాత ఆలోచనట. అయితే ఈ ప్రాజెక్ట్  విషయంలో మహేశ్ నుండి ఇంకా క్లారిటీ రావాల్సి ఉందట. మరోపక్క మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ సమయములో ఖచ్చితంగా నేను ఇంకా తెలుగు సినిమాలు చేస్తాను జీవితంలో మరో ఇండస్ట్రీలోకి వెళ్ళటం జరగదు అని క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి తరుణంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ వెళ్లే అవకాశాలు మరోపక్క వార్తలు రావడంతో ఈ న్యూస్ టాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ సంచలనం అయింది.

 

కాగా మరో వార్త ఏమిటంటే బాలీవుడ్ నటి ప్రియాంక భర్త నిక్ జోనస్ తనకి ప్రియాంక చోప్రా కి మధ్య వయసు తేడా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో వయసు గ్యాప్ గురించి ప్రశ్న ఎదురవడంతో నీ కంటే ప్రియాంక చోప్రా 10 ఏళ్ళు పెద్దది అనే ప్రశ్న రావడంతో...ప్రేమలో ఉన్నప్పుడు అటువంటివి ఏమీ గుర్తుకు రావు అంటూ నిక్ జోనస్ ప్రశ్నకి సమాధానం ఇచ్చాడు. అంతేకాకుండా ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం అని బదులిచ్చారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: