రెబల్ స్టార్ ప్రభాస్ తో తీసిన మున్నా సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అయిన యువ దర్శకుడు వంశీ పైడిపల్లి, తొలి సినిమాతో కేవలం పర్వాలేదనిపించే విజయాన్ని మాత్రమే అందుకున్నాడు. ఇక తరువాత కొంత గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ తో కలిసి ఆయన తీసిన బృందావనం సినిమా సూపర్ హిట్ కొట్టింది. ఇక దాని అనంతరం చరణ్, అల్లు అర్జున్ ల కలయికలో ఆయన తీసిన ఎవడు, అలానే ఆపై నాగార్జున, కార్తీ లతో తీసిన ఊపిరి సినిమాలు మంచి విజయాలు అందుకుని దర్శకుడిగా వంశీ కి మంచి సక్సెస్ లు అందించడం జరిగింది. 

 

ఇక గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ హీరోగా మహర్షి సినిమా తీసి మరొక హిట్ ని తన ఖాతాలో వేసుకున్న వంశీ, ఇటీవల మహేష్ తదుపరి సినిమాని కూడా మరొక్కసారి తానే తీస్తున్నట్లు తెలిపారు. అయితే ఒక వారం రోజులుగా ప్రచారం అవుతున్న వార్తలను బట్టి చూస్తే, మహేష్ చేయబోయే తదుపరి సినిమా వంశీతో కాదని తెలుస్తోంది. దానికి కారణం ఆయన స్క్రిప్ట్ ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదని అంటున్నారు. ఈలోపు మెగాస్టార్, కొరటాల శివ ల కలయికలో తెరకెక్కనున్న సినిమాలో మహేష్ ఒక కీలక పాత్రలో నటించనున్నారని, అలానే ఆపై పరశురామ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసిన అనంతరం వంశీతో సినిమా చేస్తారని వార్తలు ప్రచారం అయ్యాయి. 

 

అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ, నిన్న వంశీ ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, తనతో మహేష్ గారి సినిమా విషయమై కొద్దిరోజులుగా ప్రచారం అవుతున్న వార్తలను చూస్తుంటే తనకు ఆశ్చర్యం వేసిందని, కొందరేమో నేను కొంత హార్ట్ అయ్యానని రాసారని, ఇంకొందరు అయితే ఇంకొక అడుగు ముందుకు వేసి మహేష్ గారితో నెక్స్ట్ సినిమా చేయలేకపోవడం వలన, నేను ఆయన మీద ఎంతో కోపంతో ఉన్నట్లు రాశారని అన్నారు. అయితే అవన్నీ ఒట్టి పుకార్లే అని, ఎందుకంటే నా గురించి మహేష్ గారికి, అలానే మహేష్ గారి గురించి నాకు పూర్తి తెలుసునని, ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్ కొంత ఆలస్యం అయిన కారణంగా ఇప్పటికిప్పుడు నేను ఆయనతో చేయకపోవచ్చు గాని, అతి త్వరలో మాత్రం సినిమా ఉంటుందని అన్నారు. అయితే, ఏం తమాషాగా ఉందా అనేంతలా కొందరి రాతలపై ప్రశ్నించేంతలా తనకు కొంత అసహనం కలిగిందని, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తప్పుగా ఊహించుకుని తప్పుడు రాతలు రాస్తే అది తన తప్పు కాదని,  ప్రక్క వారి జీవితాలపై తమాషాలు చేయడం సరైనది కాదని ఆయన అన్నట్లు తెలుస్తోంది. ఇక వంశీ ప్రకటనతో మహేష్ తదుపరి సినిమా ఆయనతో కాదని స్పష్టం అయింది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: