ఈ వారం మాలీవుడ్ విశేషాలు గమనిస్తే..ఇండస్ట్రీలో సంవృత సునీల్ రెండో బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపింది. సోషల్ మీడియాలో ఆమె మాట్లాడుతూ తన మొదటి బిడ్డకు ఐదు సంవత్సరాలు రావడం జరిగింది తాజాగా ఈనెల 20వ తారీఖున అక్కకు దేవుడు తమ్ముడు గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది అంటూ ప్రేమతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంది. తన రెండో పెట్టే జన్మించడంతో తన కుటుంబం నాలుగో నెంబర్ కి చేరిందని సోషల్ మీడియాలో తెలిపింది. కాగా సంవృత సునీల్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

ఇక మరో వార్త కి వెళ్తే మలయాళం సినిమా రంగంలో 2019 సంవత్సరంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన 'లూసిఫర్' సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాకి సంబంధించి తెలుగు రీమేక్ హక్కులను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొనుక్కోవడం జరిగింది. దీంతో అప్పట్లో రామ్ చరణ్ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. చివరాకరికి మెగాస్టార్ చిరంజీవిసినిమా చేస్తున్నట్లు క్లారిటీ వచ్చింది. కాగా ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ విషయంలో అనేక మంది పేర్లు వినపడటం జరిగింది.

 

అయితే తాజాగా మాత్రం టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వివి వినాయక్ లూసిఫెర్ రీమేక్ దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం. వినాయక్ ఇంతకు ముందు మెగాస్టార్ బ్లాక్ బస్టర్ సోషల్ డ్రామా, ఠాగూర్ మరియు ఖైదీ నెంబర్ 150 లకు దర్శకత్వం వహించారు, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి లూసిఫర్ రీమేక్ ని డైరెక్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కొణిదెల ప్రొడక్షన్స్ నుండి అతికొద్ది రోజులలో బయటకు రావొచ్చు అన్న వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా సాహో సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ సుజిత్ పేరు కూడా వినబడుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: