ఫిలిం సర్కిల్స్‌ కు సంబంధించి సగానికి పైగా వార్తలు గాసిప్సే వినిపిస్తుంటాయి. సెలబ్రిటీల సినిమా కబుర్లతో పాటు వారి పర్సనల్‌ లైఫ్‌ కు సంబంధించిన వార్తలపై కూడా అభిమానుల్లో చాలా ఆసక్తి ఉంటుంది. అందుకే సినీ రంగంలో ఉన్నవారిపై వచ్చే వార్తలు విపరీతంగా వైరల్‌ అవుతుంటాయి. ఈ వారం కూడా అలాంటి వార్తలు చాలానే వినిపించాయి. అన్నింటిలోకి ఎక్కువగా సినీ అభిమానులకు కిక్‌ ఇచ్చిన గాసిప్‌ గురించి ఇప్పుడు చూద్దాం.

 

ఇటీవల కాలంలో  హీరోలు ఇగోలను పక్కన పెట్టి ఒకరి సినిమాకు ఒకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. భారీ స్టార్ ఇమేజ్‌ ఉన్న హీరోలు కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఒకరి సినిమా వేడుకకు ఒకరు హాజరు కావటం, రిలీజ్ తరువాత సినిమా సూపర్‌ అంటూ ఓ ట్వీట్ చేయటం లాంటి సపోర్ట్ ఇస్తున్నారు. కొంత మంది హీరోలైతే మరో అడుగు ముందుకేసి అతిథి పాత్రల్లో నటించేందుకు ముందుకు వస్తున్నారు. అలా గెస్ట్ రోల్‌ లో నటించేందుకు ఏకంగా సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు కూడా ఓకే చెప్పాడట.

 

సైరా నరసింహారెడ్డి తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ మెసేజ్‌ ఓరియంటెడ్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఆచార్య, గోవింద ఆచార్య అనే టైటిల్స్‌ ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోసారి చిరు తనయుడు రామ్‌ చరణ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సూపర్‌ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నాడట. ఇప్పటికే చిరు సినిమా కోసం డేట్స్ కూడా ఇచ్చాడట మహేష్‌, చరణ్‌ కూడా మహేష్ రేంజ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా భారీ రెమ్యూనరేషన్‌ ఇచ్చేందుకు ఓకె చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ కు జోడిగా పూజా హెగ్డే నటించనుందన్న టాక్‌ వినిపిస్తోంది. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: