సంక్రాంతి తర్వాత ఒక మంచి సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అనే చెప్పవచ్చు. సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాలు మినహా ఆ తర్వాత వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు అనే చెప్పవచ్చు. సంక్రాంతికి వచ్చిన ఒకే ఒక్క సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా ఒకటే పర్వాలేదనిపించింది. ఇక ఆ తర్వాత వచ్చిన శర్వానంద్, సమంతా కాంబినేషన్ లోని జాను సినిమా, విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఆకట్టుకోలేదు. 

 

డిస్కో రాజా రవితేజా హీరోగా వచ్చి బోల్తా పడింది. ఈ మూడు సినిమాలు కూడా భారీ అంచనాలతో వచ్చినవే. దీనితో ప్రేక్షకులు కూడా వాటి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే భీష్మా సినిమాతో టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుంది అనే చెప్పవచ్చు. నితిన్ హీరోగా వచ్చిన ఆ సినిమా మంచి విజయం సాధించింది అనే చెప్పుకోవాలి. ఇక ఈ వారం వచ్చిన హిట్ సినిమా మంచి విజయాన్ని అందించింది. విడుదలైన రోజే మంచి టాక్ తెచ్చుకుంది. నానీ నిర్మాతగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది అనే చెప్పుకోవాలి. 

 

ఇక ఈ సినిమాతో పాటుగా వచ్చిన రెండు మూడు సినిమాలు బాగానే ఆడుతున్నాయి. ఏది ఎలా ఉన్నా ఈ వారం టాప్ ట్రెండింగ్ సినిమా మాత్రం హిట్ అనే చెప్పుకోవాలి. ఆ తర్వాత రాహు సినిమా కూడా పర్వాలేదనిపించింది. హిట్ సినిమాకు సోషల్ మీడియా ప్రచారం బాగా కలిసి వచ్చింది అంటున్నారు ప్రేక్షకులు సినీ జనాలు. నానీ నిర్మాత కావడం కథ కూడా భిన్నంగా ఉన్న నేపధ్యంలో ఈ సినిమాను ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకుంది. అందుకే సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం కూడా జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: